Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒకవైపు కొనుగోళ్లు..మరోవైపు పేలుళ్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 29,2022

ఒకవైపు కొనుగోళ్లు..మరోవైపు పేలుళ్లు

- ప్రాణాంతకమవుతున్న వైనం
- ఆయోమయంలో వినియోగదారులు
- స్వల్పంగా పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహనాలు
- దేశవ్యాప్తంగా 162.97 శాతం కొనుగోళ్లు
- పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలే మూలం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
           పెట్రోలియం వాహనాలను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రజానీకం ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) కొనుగోలు, వినియోగం వైపు దృష్టిసారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో స్వల్పంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కోనుగోళ్ల శాతం అధికమవుతున్నది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటం, చమురు వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వైపు వినియోగదారులు మళ్లుతున్నారు. కాగా, గత రెండేండ్లుగా ఈ సంఖ్య దేశవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్నా, రాష్ట్రంలో మాత్రం నామమాత్రంగా ఉండటం గమనార్హం. 2021లోనే దేశవ్యాప్తంగా 32,4840 ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడైతే, రాష్ట్రంలో 4,456 ఈవీలను మాత్రమే వినియోగదారులు తీసుకున్నట్టు కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారుల సమాచారం. అంతకుముందు ఏడాది 2020లో రాష్ట్రంలో కేవలం 847 ఈవీలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019లో 1037 ఈవీలు కోనుగోలు జరిగినట్టు సమాచారం. ఇప్పటివకు రాష్ట్రవ్యాప్తంగా 6340 ఈవీలు ఉండగా, దేశవ్యాప్తంగా 6,13,220 ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడకంలోకి వచ్చాయి. 2020లో 25.07శాతం ఈవీల కొనుగోలు ఉంటే, 2021కి వచ్చేసరికి 162.97 శాతం పెరిగిందని సమాచారం. ఇప్పుడిప్పుడే ప్రజానీకం ఈవీలవైపు దృష్టిపెడుతున్నారనీ, ఈ సంఖ్య రానున్న మూడేండ్లల్లో భారీస్థాయిలో పెరిగే అవశాశాలు విస్త్రృతంగా ఉన్నాయని అధికారిక సమాచారం.
ఈవీల సబ్సీడికి రూ.18 వేల కోట్లు
           ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను ప్రొత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లను కేటాయించింది. ఐదేండ్ల కాలానికిగాను సబ్సిడీలు ఇచ్చేందుకు ఈ నిధులు ఖర్చుచేయనున్నారు. ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌(పీఎల్‌ఐ) పథకం కింద ఈ నిధులను దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రొత్సహించేందుకుగాను వినియోగిస్తామని చెబుతున్నారు. వీటితోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వస్తు, మానవ రవాణాకు ఈవీలు, బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రొత్సహించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం విదితమే.
ఆయోమయం..ఆందోళన
           ఎలక్ట్రిక్‌ వాహనాల కోనుగోళ్ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం చురుగ్గా చర్యలు చేపట్టింది. పన్నులు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజులను పూర్తిగా ఎత్తేసింది. ఈవీల కోనుగోళ్లుపెరిగే అవకాశాలున్న తరుణంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సంఘ టనలు వినియోగదారులను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజామాబాద్‌లో ఈవీ ఛార్జింగ్‌ నడు స్తుండగా 80 ఏండ్ల వృద్ధుడు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పుణే, విజయవాడల్లోనూ మరో ఇద్దరు చని పోయారు. ముంబయి, ఢిల్లీ నగరాల్లోనూ ప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల కోనుగోళ్ల విషయంలో ఒకింత ఆలోచించే పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 138 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. మరో 600 కేంద్రాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యుత్‌ శాఖ చర్యలు చేపట్టింది. జాతీయ రహదారులు, స్టేట్‌ హైవేల వెంబడి, అలాగే విద్యుత్‌ సబ్‌స్టేషన్ల సమీప ప్రాంతాల్లోనూ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ(టీఎస్‌ రెడ్కో) ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పక్కా, పటిష్టమైన ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేసేలా చర్యలు తీసుకుంటామని వారం రోజుల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.