Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతులకు కుచ్చుటోపీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 01,2022

రైతులకు కుచ్చుటోపీ

- సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు ఇప్పిస్తామని టోకరా
- రిమాండ్‌కు 8 మంది నిందితులు
- పరారీలో మరో ఐదుగురు : ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
            వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇప్పిస్తామని రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాడుగులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సింగం సైదులు తమకు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని తిప్పర్తి మండలం ఇండ్లూర్‌ గ్రామానికి చెందిన బసవోజు నాగబ్రహ్మచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనలా మరో ఎనిమిది మంది రైతుల నుంచి సుమారు రూ.8.80 లక్షల వరకు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో నల్లగొండ డీఎస్పీ, శాలిగౌరారం సీఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు.
తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన నూకల నాగరాజు ఉపాధి హామీ చట్టంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వాటర్‌ షెడ్‌ డిపార్ట్‌మెంట్‌లో 2012లో వాటర్‌ షెడ్‌ అసిస్టెంట్‌గా చేరాడు. సుమారు ఐదేండ్లపాటు తిప్పర్తిలోనే పని చేశాడు. అప్పట్లో ప్రభుత్వం పీఎస్‌ఐ స్కీమ్‌ ప్రకారం రైతులకు వ్యవసాయ పరికరాలపై 75 శాతం రాయితీ ఇచ్చింది. ఈ క్రమంలో నూకల నాగరాజు అప్పటి వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌తో ఉన్న పరిచయంతో తిప్పర్తిలో కొంతమంది రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు ఇప్పించి కమీషన్‌ తీసుకున్నాడు. 2018లో తెలంగాణ ప్రభుత్వం పీఎస్‌ఐ స్కీమ్‌ను ఎత్తేసింది. దాంతో వాటర్‌ షెడ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ తొలగించారు. అయినా, నూకల నాగరాజు గతంలో పని చేసిన ఐడీ కార్డును చూపించి తిప్పర్తి మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో మార్కెట్‌ ధర కంటే సగానికే వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని రైతులను నమ్మించాడు. కల్టీవేటర్‌కు రూ.9000, ట్రాక్టర్‌ పంప్‌కు రూ.11,000, రోటవేటర్‌కు రూ.35,000, ట్రాలీకి రూ.1,10,000, బేలర్‌కు రూ.1,45,000, ట్రాక్టర్‌ ఇంజన్‌కు రూ.3,50,000, కల్టీవేటర్‌ సెట్‌కు రూ.30,000, హాఫ్‌ వీల్స్‌కి రూ.9000, చిప్పలకు రూ.25,000, ఫుల్‌ వీల్స్‌కు రూ.18,000, త్రేస్సర్‌కు రూ.2,40,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించి వసూలు చేశాడు. అలా రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆ డబ్బులతో నల్లగొండ, మిర్యాలగూడలోని ఏజెన్సీల ద్వారా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైతే వ్యవసాయ పరికరాల కోసం ఇబ్బంది పెడతారో వాళ్లకు ముందుగా వాటిని ఇచ్చేవాడు. మిగతా వారికి రేపు మాపంటూ తప్పించుకు తిరిగారు. ఇలా సుమారు రెండు మూడేండ్ల నుంచి నూకల నాగరాజు అతని అనుచరులతో కలిసి 19 మండలాల్లోని 79 గ్రామాలకు చెందిన 498 మంది రైతులను రాయితీపై వ్యవసాయ పరికరాల పేరిట మోసం చేశాడు. నూకల నాగరాజు వద్ద సింగం సైదులు, ఉప్పునూతల నాగరాజు, కొండ సైదులు, బొదనపు మధుసూదన్‌రెడ్డి, బాత్క సైదులు, చింతకాయల సంతోష్‌, మరికొందరు కమీషన్‌ ఏజెంట్లుగా పనిచేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ జి.వెంకటేశ్వర్‌ రెడ్డి, శాలిగౌరారం సీఐ ఎస్‌.రాఘవరావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజశేఖర్‌, తిప్పర్తి ఎస్‌ఐ యం.సత్యనారాయణతోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.