Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సత్యం వైపే కవి నిలబడాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 02,2022

సత్యం వైపే కవి నిలబడాలి

- కష్టజీవికి కాపలా కాయాలి:
- తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి

- మేడే సందర్భంగా కవి సమ్మేళనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             కవి అనేవాడు ఎల్లప్పుడూ సత్యం వైపే నిలబ డాలని తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె.ఆనం దాచారి కోరారు. కష్టజీవులకిరువైపులా కాపలా కాసే వాడే నిజమైన కవి అని శ్రీశ్రీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో మేడే సంద ర్భంగా తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఆ సంఘం సహాయ కార్యదర్శి ఎస్‌కే సలీమా అధ్యక్షతన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి సమాజంలో కార్మికుడు దోపిడీకి గురయ్యే తీరు మారిందనీ, ప్రతి ఒక్కరూ తమ అవసరాలు, అనివార్య పరిస్థితుల కారణాల వల్ల 10 గంటల నుంచి 14 గంటలు పనిచేస్తున్న పరిస్థితి నెలకొందని వివరించారు. అలా యాజమా న్యాలు శక్తినంతా పిండేయటం వల్ల శ్రామికులు పదేం డ్ల కంటే ఎక్కువ పనిచేయలేరనీ, తమ శక్తిని కోల్పో తారని ఆందోళన వ్యక్తం చేశారు. మతం, ప్రాంతం, కులం, వర్ణం, లింగం, పేరిట పాలకులు, యాజ మాన్యాలు కార్మికులను చీల్చి ఉంచుతున్న పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్నారు. సాధారణమైన కార్మికులు సంఘటితం కావాలనే కోరిక నుంచి పుట్టుకొచ్చిందే మేడే అన్నారు. బలవంతమైన సర్పం చలిచీమల చేతిలో చావక తప్పదు అని అప్పుడెప్పుడో సుమతీ శతకం ద్వారా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము పెట్టిన పుట్టను పాము ఆక్రమిం చుకుని దోపిడీ చేస్తే ఊరుకోబోమని చీమలు తిరుగు బాటు చేసినట్టే..నేడు సమాజంలో కార్మికులంతా ఐక్యమై పెట్టుబడిదారులపై తిరుగబడే రోజులు వస్తా యనీ, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు అనే నినాదం వెనుక ఆ పద్యం సారం, అంతర్యం ఉందని చెప్పారు. సంపద సృష్టికర్తలు పెట్టుబడి దారులు కాదు శ్రామికులేనని నొక్కి చెప్పారు. తెలం గాణ సాహితీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షం వహిస్తుం దని హామీనిచ్చారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర నాయ కులు రాంపల్లి రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ కవిసమ్మే ళనం పెద్దలు ఎంత మంది ఉన్నారో యువకులు కూడా అంతే ఉండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. వారంతా శ్రమైక జీవన సౌందర్యాన్ని అర్థం చేసుకుని నేటి కవిత్వాన్ని రాశారన్నారు. తెలంగాణ సాహితీ ఉపాధ్యక్షులు నస్రీన్‌ఖాన్‌, అనంతోజు మోహన్‌కృష్ణ, తంగిరాల చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రామిక కవిసమ్మేళనాన్ని నిర్వహించారు.
ఆలోచింపజేసిన కవి సమ్మేళనం
'బారులు, బీర్ల ప్రవాహంలో నన్ను నేను నిలబెట్టుకునే శ్రమతత్వం నాది...ఈదులు, బొత్తలు, పోతాళ్లు, కర్రలే నా బలం..' అంటూ ఎం.స్వామి అనే కవి 'తపన' శీర్షిక ద్వారా ప్రపంచీకరణ వల్ల తన జీవనోపాధిని కాపాడుకునేందుకు గీతకార్మికుని శ్రమత్వాన్ని చాలా చక్కగా వివరించారు. 'శ్రమైక జీవన సౌందర్యం' కవిత ద్వారా కార్మికుల శ్రమను తక్కువ చేసి చూసే మన దృష్టి లోపాన్ని కొండామోహన్‌ ఎత్తిచూపారు. ప్రభాకరాచారి అనే కవి 'మార్పు రావాలి' అనే కవిత ద్వారా మహిళలు, డెలివరీ బారులు, ఆయా రంగాల కార్మికులు పడుతున్న కష్టాలను కండ్లకు కట్టినట్టు చూపారు. సమాజంలో మార్పు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులు చిల్లరగాళ్లు అని అన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఏ నర్సింహ్మ అనే కవి..ఆర్టీసీ కార్మికులు పడుతున్న బాధలు, వారంతా ఒక్కటై పోరాడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ...'అవును నిజమే అన్నాడు..తెలిసి అన్నాడో..తెలియక అన్నాడో..ఒకప్పుడు ఒక్కటిగా కొట్లాడేటోళ్లం..నేడు పాలకుల కుట్రలతో విడిపోయి పోరాడుతున్నాం..ఐక్యంగా ఉంటే ఇలా అనేటోడా?' అనే కవితను చదివి వినిపించారు. భవన నిర్మాణ రంగంలో మహిళా కార్మికులు పడే బాధలను ఆకాశ్‌ తన కవిత ద్వారా కండ్లకు కట్టినట్టు చూపారు. మహేశ్‌ అనే యువకవి అడ్డాల మీద పని కోసం ఎదురుచూసే కూలీల కష్టాలను 'కూలిఅడ్డా' అనే కవిత ద్వారా హృదయవిదారకంగా వివరించారు. శ్రమైక జీవన సౌందరాన్ని, పోరాటాల ఆవశ్యకతను వివరిస్తూ 'నిజం', 'మళ్లీ మొలకెత్తుతాయి', 'శ్రమైకజీవనం', 'విప్లవస్వైరం', 'దారిపొడవునా ఉద్యమపాఠాలు', తదితర కవితలను కవులు వినిపించారు. కవులందరికీ సాహితీ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలను, పుస్తకాలను అందజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.