Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐక్యపోరాటాలే శరణ్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 03,2022

ఐక్యపోరాటాలే శరణ్యం

- విచ్ఛిన్న, విభజన ఉద్యమాలపై పోరాటాలు చేయాలి బీజేపీ విధానాలను తిప్పికొట్టాలంటే కార్మిక, కర్షక మైత్రి అత్యావశ్యకం : సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
- చర్లపల్లి పారిశ్రామికవాడలో 136 అడుగుల అరుణపతాక ప్రదర్శన
- అందరికీ ఉపాధి, భూమి, ఆహారం, ఇల్లు, విద్యా,వైద్యం కోసం పోరాటాలు : బి.వెంకట్‌
- పోరాటం కార్మికుల జన్మహక్కు..కాలరాయాలని చూస్తే ఊరుకోం : పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
              ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, మరోవైపు దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే బీజేపీ సర్కారు విధానాలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నదనీ, దాని నుంచి బయట పడేందుకే మోడీ సర్కారు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక, కర్షక ఐక్యత సాధిస్తూనే విచ్ఛిన్న, విభజన ఉద్యమాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో చర్లపల్లి పారిశ్రామిక వాడలో చర్లపల్లి ఇండిస్టీయల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో 136వ మేడేను పురస్కరించుకుని 136 అడుగుల అరుణపతాక ప్రదర్శన చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చౌరస్తా నుంచి సూరారం చౌరస్తా వరకు ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ..పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలో నెట్టుడుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలు ఇకసాగవనీ, 12 నుంచి 15 గంటల పనివిధానాన్ని ఆమోదించబోమని అఖిల భారత సమ్మె ద్వారా కార్మికవర్గం నిరూపించిందని చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను కార్మికులకు విడమర్చి చెబుతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయవద్దనీ, విద్యా,వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించేలా పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ నిర్ణయించిందన్నారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ పేరుతో సహజవనరులను, జాతి సంపదను కారుచౌకగా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉందని నొక్కి చెప్పారు. దేశభక్తిముసుగులో దేశాన్ని పరాధీనత చేసే కుట్రను తిప్పికొడతామన్నారు. అంతర్జాతీయ పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గాన్ని దెబ్బతీస్తున్నదనీ, అందుకే మేడే సందర్భంగా అన్ని దేశాల్లోనూ కార్మికులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారని తెలిపారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ.. దేశంలోని సామ్రాజ్యవాదులు, గుత్తపెట్టుబడిదారులు, భూస్వాములను ఓడించాలంటే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు మరింత ఐక్యతతో పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నల్లచట్టాలు చేస్తూ ప్రశ్నించే వాళ్లందర్నీ జైళ్లలో పెడుతున్న కేంద్రం ప్రభుత్వం ప్రపంచానికి ఎలా ఆదర్శమవుతుందని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే జిగేశ్‌ మేవానికి అరెస్టు చేసి అస్సాం తీసుకెళ్లారనీ, కోర్టు బెయిలిచ్చిన వెంటనే మరో కేసు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా మోడీ సర్కారు గుడ్డిగా ముందుకెల్తున్నదని విమర్శించారు. ప్రపంచ ఆకలి సూచికలో చివరి నుంచి రెండోస్థానం (109వ స్థానం)లో ఉండటం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలకు మోడీ సర్కారు తిలోదకాలిచ్చి ముందుకెళ్తున్నదని విమర్శించారు. అందరికీ ఉపాధి, భూమి, ఆహారం, ఇల్లు, విద్యా,వైద్యం అందివ్వాలనే డిమాండ్‌తో మే 16 నుంచి దేశవ్యాప్తంగా ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు.
              సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, పాలకవర్గాల ఒత్తిడితో పరిశ్రమలపై కార్మిక శాఖ పర్యవేక్షణ కొరవడిందన్నారు. లేబర్‌ కోడ్ల ద్వారా 12 గంటల పనిధానం తీసుకొచ్చి వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును, సంఘం పెట్టే హక్కును కాలరాయాలని చూస్తున్నదని విమర్శించారు. సీఓడీ విధానానికి తూట్లు పొడుస్తున్నదనీ, యాజమాన్యమిచ్చే వేతనమే తీసుకోవాలనే విధంగా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఈ చర్యలన్నింటినీ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోరాటం చేయడం కార్మికుల జన్మహక్కు అనీ, దాన్ని కాలరాసే పాలకులకు ఘోరీ కడతామని హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సోషల్‌ మీడియా మేడే అంటే మోడీ, అమిత్‌షా, యోగి అని పోస్టులను పెడుతూ చరిత్రను మసకబార్చే ప్రయత్నాలకు పూనుకోవడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్‌, సీఐఈయూ అధ్యక్షులు బీవై సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు, కోశాధికారి ఎమ్‌ఎస్‌రావు, నాయకులు మణికంఠ, నర్సింహ్మ, సంతోశ్‌, వసంతరావు, శ్రీనివాస్‌, చిన్నయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.