Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్మార్ట్‌సిటీలు పూర్తయ్యేనా..!? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 07,2022

స్మార్ట్‌సిటీలు పూర్తయ్యేనా..!?

- నిధుల్లేక ఏండ్ల తరబడి పెండింగ్‌
- ఆర్భాటమే తప్ప ఆచరణలో అంతంతే
- 144 పనులకుగాను 27 మాత్రమే పూర్తి
- దేశవ్యాప్తంగా 60 శాతమే
- చోద్యం చూస్తున్న కేంద్రం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
          కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలు రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు , రెండడుగులు వెనక్కిలా తయారైంది. ఈ పథకంలో పనులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండ టమే ఇందుకు నిదర్శనం. కరీం నగర్‌లో కేవలం 10 శాతం, వరంగల్‌లో సుమారు 35 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు అంటు న్నారు. వాస్తవానికి ఇరు ప్రభుత్వాలు చేపట్టాలనుకున్న మొత్తం 144 ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు పూర్తిచేసినవి 27 మాత్రమే. ఈ సంగతి గత పార్లమెంటు సమా వేశాల్లో కేంద్రం తెలియజేసింది. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని ఇచ్చే లక్ష్యంతో స్మార్ట్‌సీటీలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అంతేగాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా సత్ఫలితాలు సాధించాలని భావించింది. ఇందుకోసం పలు అబివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ద్వితీయ శ్రేణి నగరాల కోసమే...
          దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్‌సీటీల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌ నగరాలను మరింత అభివృద్ధిచేయాలని సంకల్పించింది. ఈ రెండు నగరాల్లో మౌలిక వసతుల కోసం ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.100 కోట్లు స్మార్ట్‌సిటీల పథకంలో భాగంగా ఖర్చుచేయాలని నిర్ణయించాయి. కాగా ఈ పథకానికి కరీంనగర్‌ ప్రగతికి ఇప్పటివరకు రూ.1609 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా, కేవలం రూ.166.46 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో 62 పనులు పూర్తి కావాల్సి ఉన్నా, కేవలం తొమ్మిది మాత్రమే చేపట్టారు. ఈ గణాంకాల ప్రకారం నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదే సమయంలో గ్రేటర్‌ వరంగల్‌ జిల్లాకు రూ.1752,31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, కేవలం రూ.582.63 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 82 పనులు పూర్తి కావాల్సి ఉన్నా కేవలం 18 మాత్రమే చేశారు. సుమారు 35 శాతం పూర్తయ్యాయి.
తీవ్ర ఆలస్యం
          స్మార్ట్‌సిటీల ప్రాజెక్టు ప్రక్రీయ తీవ్ర ఆలస్యమవు తున్నది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమేనని సమాచారం. తమ, తమ వాటా నిధులు కేటాయించకుండా చోద్యం చూస్తున్నదనే విమర్శలనుకేంద్రం ఇప్పటికే ఎదుర్కొంటున్నది. కాగా రాష్ట్రంపై వచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెండు నగరాలకు కలిపి రూ.3,361.74 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించినా, కేవలం రూ.1884.79 కోట్లు మాత్రమే కేటాయించారని అధికారులు చెబుతున్నారు. మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను నిలిపివేస్తున్నదని సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇంకా డీపీఆర్‌ దశలోనే..
          రెండు నగరాల పరిధిలోని చాలా పనులు ఇంకా డీపీఆర్‌ దశలో ఉన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌లో 12 పనులు ఉండగా, వాటి అంచనా విలువ రూ.139.21 కోట్లు, కరీంనగర్‌లో 31 పనులకుగాను వాటి అంచనా విలువ రూ.822.70 కోట్లుగా ఉంది. టెండర్‌ స్థితిలో వరంగల్‌కు సంబంధించి తొమ్మిది పనులు ఉండగా, వాటి విలువ రూ.279.90 కోట్లు , కరీంనగర్‌ పరిధిలో ఆరు పనులకుగాను రూ.235.14 కోట్లని సమాచారం. పని అప్పగించే స్థితిలో వరంగల్‌లో 18 పనులకుగాను రూ.582.90 కోట్లు, కరీంనగర్‌లో తొమ్మిది పనులకుగాను రూ.169.46 ఉన్నాయని అధికారులు అంటున్నారు.సకాలంలో నిధులు కేటాయించి, ఖర్చు చేసి ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవని పేరు రాయడానికి ఇష్టపడని అధికారులు చెబుతున్నారు.
దేశంలో 60 శాతమే
           అయితే స్మార్ట్‌సిటీల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 6282 పనులు చేపట్టాలని నిర్ణయించగా, వాటి కోసం దాదాపు రూ.1,91,238 కోట్లు ఖర్చవు తాయని ఆ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. వీటిలో గత 2022, మార్చి నాటికి కేంద్ర గృహ నిర్మాణ, అర్భన్‌ డెవలప్‌మెంటు శాఖ అధికారుల సమాచారం ప్రకారం దేశంలోని 100 స్మార్ట్‌సీటీలకు రూ.59,959 కోట్లు ఖర్చు చేసి 3,576 పనులను మాత్రమే పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలో లేవు. సుమారు 60 శాతం మాత్రమే పూర్తయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.