Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోచింగ్‌ దోపిడీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 08,2022

కోచింగ్‌ దోపిడీ

- అడ్డూఅదుపు లేకుండా ఫీజు వసూలు
- గ్రూప్‌-1, పోలీసు, టెట్‌ నోటిఫికేషన్లు విడుదల
- ఇదే అదనుగా 'క్యాష్‌'చేసుకుంటున్న వైనం

- నిరుద్యోగులపై పెనుభారొం నియంత్రణను గాలికొదిలిన టీఆర్‌ఎస్‌ సర్కారు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దువాలి అన్నట్టుగా కోచింగ్‌ కేంద్రాలు నోటిఫికేషన్లు వచ్చినపుడే యధేచ్చగా వ్యాపారం చేస్తున్నాయి. వాటి దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిరుద్యోగులను అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్‌-1, పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ వచ్చింది. అదే అదనుగా 'క్యాష్‌' చేసుకోవాలని కోచింగ్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా ఫీజులు గుంజుతున్నాయి. గ్రూప్‌-1కు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు, గ్రూప్‌-2కు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు, పోలీసు కానిస్టేబుల్‌, ఎస్‌ఐకి రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, టెట్‌కు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, టెట్‌, టీఆర్టీకి కలిపి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాల్లోనూ కోచింగ్‌ కేంద్రాలున్నాయి. ఈ ఫీజులతో నిరుద్యోగ యువకులు బెంబేలెత్తుతున్నారు. వాటిని కట్టలేక సతమతమవుతున్నారు. ఇంకోవైపు కోచింగ్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు, పుస్తకాలు వంటివాటితో నిరుద్యోగులపై పెనుభారం పడుతున్నది. ఇప్పటికే కోచింగ్‌ తీసుకున్న వారు స్టడీ హాల్‌కు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు చెల్లించాల్సి వస్తున్నది. ఈ అవకాశం మళ్లీ రాదేమోనన్న భావనతో నిరుద్యోగులు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో ఖర్చుకు వెనుకాడడం లేదు. ఈ బలహీనతను కోచింగ్‌ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. వాటి నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణ కోసం కమిటీ వేస్తామంటూ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా ఇంత వరకూ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వసతులు అంతంతే...
           రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, ఇతర ఇరుకు గదుల్లో కోచింగ్‌ కేంద్రాలు వెలుస్తున్నాయి. వాటిలోనే వేలాది మంది నిరుద్యోగులకు కోచింగ్‌ ఇస్తున్నారు. కానీ వాటిలో వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అంటే సరిపోయినన్ని టారులెట్లు, మరుగుదొడ్లు, తాగునీరు, వెలుతురు సక్రమంగా ఉండేలా తరగతి గదులు వంటి మౌలిక వసతులను సమకూర్చడం లేదు. ఇంకోవైపు ఇబ్బడిముబ్బడిగా కోచింగ్‌ కేంద్రాలు ప్రారంభిస్తుండడంతో వాటిలో అర్హులైన వారు బోధిస్తున్నారా? లేదా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. కనీస వసతులు కల్పించకుండా ఎక్కువ మంది నిరుద్యోగులను చేర్చుకోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కోచింగ్‌ కేంద్రాల యాజమాన్యాలు మాత్రం వసతుల కల్పనపై కాకుండా కేవలం ఫీజులపైనే దృష్టిసారించడం గమనార్హం. ఇంకోవైపు కోచింగ్‌ కేంద్రాలకు రిజిస్ట్రేషన్‌ ఉన్నదా?, నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయా?అన్నది సైతం అనుమానమే. 1997, ఆగస్టు 6న జారీ చేసిన జీవో నెంబర్‌ 200 ప్రకారం కోచింగ్‌ సెంటర్లు, ట్యుటోరియల్స్‌ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అయితే ఎంసెట్‌, ఐఐటీ, మెడికల్‌, పీజీ, ఎడ్‌సెట్‌, బ్యాంకింగ్‌, సివిల్స్‌, గ్రూప్స్‌, ఐటీతోపాటు ట్యుటోరియళ్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఎడ్యుకేషన్‌ యాక్ట్‌-1982లోని సెక్షన్‌ 32 ఆధారంగా జీవో నెంబర్‌ 200 ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటూ గతంలోనే ఆదేశించింది. రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించాలనీ, రూ.10 వేలు డిపాజిట్‌ చేయాలని కోరింది. కోచింగ్‌ కేంద్రాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది.
ప్రత్యామ్నాయాలపై అభ్యర్థుల దృష్టి
           వేలాది రూపాయలు ఫీజు చెల్లించి కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుద్యోగులు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. దీనికి ఫీజు తక్కువ, సమయం కలిసొస్తుంది. ప్రయాణించే అవకాశముండదు. ఆన్‌లైన్‌ కోచింగ్‌కు డబ్బులు కట్టలేని వారు స్టడీ మెటీరియల్‌తో సర్దుకుంటున్నారు. సొంతంగానే పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. స్టడీ హాళ్లలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు. గ్రూప్స్‌, పోలీసు, టెట్‌ వంటి కోచింగ్‌ను టీశాట్‌, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇస్తున్నాయి. వాటికి అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇంకోవైపు పోలీసు కానిస్టేబుల్‌ కోచింగ్‌ను చాలా మంది ఎమ్మెల్యేలు సైతం తమ సొంత ఖర్చుతో ఇప్పిస్తుండడం గమనార్హం. వీలైనంత మంది ఈ కోచింగ్‌లకు వినియోగించుకుంటున్నారు.
టీఆర్టీ కోచింగ్‌పై ప్రభుత్వం దృష్టిసారించాలి :
రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు
           ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌ కోచింగ్‌ పట్ల ఎక్కువ మంది అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ఇంకోవైపు ఇంతకుముందే టెట్‌ కోచింగ్‌ ఎక్కువ తీసుకోవడంతోపాటు అర్హత సాధించారు. పోలీసు కానిస్టేబుల్‌ కోచింగ్‌ను ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు. టీఆర్టీ కోచింగ్‌పైనా ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాలి. టీశాట్‌ కోచింగ్‌లో మార్పు చేయాలి. ప్రయివేటు ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థలు బోర్డును వినియోగించి అభ్యర్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి. టీశాట్‌లో చర్చావేదికలా ఉండడం వల్ల అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. తరగతిలో బోధించినట్టు ఉంటే ఎక్కు మంది అభ్యర్థులకు బాగుంటుంది.
కోచింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం నియంత్రించాలి :కోట రమేష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు
             రాష్ట్రంలోని కోచింగ్‌ కేంద్రాలను ప్రభుత్వం నియంత్రించాలి. అందుకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని నియమించాలి. యధేచ్చగా ఫీజుల దోపిడీ సాగుతున్నది. పెద్దఎత్తున కోచింగ్‌ కేంద్రాల వ్యాపారం సాగుతున్నది. పేద, మధ్యతరగతి అభ్యర్థులకు ఆర్థికంగా తీవ్రనష్టం. అయితే పాలకులకు ముడుపులు అందుతున్నాయనే విమర్శలున్నాయి. అందుకే అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజులను అరికట్టాలి. కోచింగ్‌ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.