Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్త శ్రామికుల పండుగ మేడే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 08,2022

సమస్త శ్రామికుల పండుగ మేడే

- 12 గంటల పని విధానం దుర్మార్గం
- కార్మికవర్గ ఐక్యతను చీలుస్తున్న మోడీ ప్రభుత్వం
- కార్మిక కోడ్లతో యథేచ్ఛగా శ్రమ దోపిడీకి అవకాశం
- కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిందే.. : 'మే డే' వారోత్సవాల ముగింపు సభల్లో నేతల పిలుపు
నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగం
                సమస్త శ్రామికుల పండుగ మేడే తప్ప మరోటి కాదు.. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తొలగించి.. 12 గంటల పని విధానం తేవడం దుర్మార్గం.. కార్మిక చట్టాలను తొలగించి నాలుగు కార్మిక కోడ్లను తెచ్చి కార్మికుల శ్రమను యాజమాన్యాలు యథేచ్ఛగా దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం అవకామిస్తోంది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలి'' అని మేడే వారోత్సవాల ముగింపు సభల్లో నేతలు ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పెద్దఎత్తున మేడే వారోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
                సంగారెడ్డి జిల్లా గణేష్‌నగర్‌లో నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌.సుధాభాస్కర్‌ పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టరేట్‌, న్యూ బస్టాండ్‌ నుంచి అమరవీరుల స్థూపం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో వారు మాట్లాడారు. 12 గంటల పని విధానం అమలు కార్మికులకు తీవ్ర నష్టదాయకమన్నారు. నిత్యం కష్టం చేస్తే 50 యేండ్లకే జీవితకాలం ముగుస్తుందని తెలిపారు. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేస్తూ కార్మికుల పొట్టగొట్టడం సిగ్గుచేటన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులపై దాడిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పిడికిలి బిగించాలని, పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
                వారం రోజులుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన మే డే వారోత్సవ కార్యక్రమాల ముగింపు వేడుకలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం విశాల ఐక్యవేదికతో పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే అనేది భారతీయ సంస్కృతి కాదని.. ఇక్కడ విదేశీ సంస్కృతిని పాటించకూడదని మోడీ అనడం సిగ్గు చేటన్నారు. మే డేను వక్రీకరించడం అంటే కార్మిక వర్గాన్ని మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్‌లో బైక్‌ ర్యాలీ, అనంతరం గంజ్‌లో సభ జరిగింది.
                మే డే వారోత్సవాల ముగింపు సభను హైదరాబాద్‌ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని సీఐఏహాల్‌లో నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ హాజరయ్యారు. కార్మికుల హక్కులు.. పనిగంటలు.. కార్మిక కోడ్ల వివరించారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
కార్మిక కోడ్లపై సమరశీల పోరాటాలు
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
                29 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో అధ్యక్షులు యంవి.అప్పారావు అధ్యక్షతన మే డే వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఎం.సాయిబాబు జెండావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు కార్మిక కోడ్లను జూన్‌ నుంచి అమలు చేసే ప్రమాదం ఉందని చెప్పారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌
                మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్‌ చౌరస్తా వద్ద మేడే ముగింపు సభ నిర్వహించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నెహ్రుగంజి హమాలీ ఆఫీస్‌ వద్ద నిర్వహించిన మేడే ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశ సంపద అందరికీ చెందాలి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌
                దేశ సంపద కొంతమంది చేతిలోనే ఉందని.. అది అందరికీ చెందాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్‌ అన్నారు. మే డే వారోత్సవాల ముగింపు సందర్భంగా నర్సాపూర్‌లో సభ, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు ప్రజలు, కార్మికులు బెంబేలెత్తుతుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జాతీయ సంపదను పూర్తిగా అంబానీ, అదానీలకు కట్టబెట్టే పనిలో ఉందని విమర్శించారు.
కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రమ
                కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రమ ఐద్వా హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి నాగలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మధురానగర్‌లోని స్టేట్‌ హోమ్‌లోగల శిశువిహార్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు ఆటలపోటీలు నిర్వహించారు. ముషీరాబాద్‌ జోన్‌ పరిధిలో అంబేద్కర్‌నగర్‌, భరత్‌నగర్‌ బస్తీల్లోనూ క్రీడలు నిర్వహించారు. విజేతలకు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ బహుమతులు ప్రదానం చేశారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.