Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భరోసా లేని గీత బతుకు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 08,2022

భరోసా లేని గీత బతుకు

- వృత్తిలో అడుగడుగా జీవన్మరణమే
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ డిమాండ్‌
- శక్తి మేరకు ఆదుకుంటున్న తాడీ కార్పొరేషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
             రాష్ట్రంలో గీత కార్మికుల ప్రాణానికి భరోసా లేదు. తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తారో రారోనన్న ఉత్కంఠ.. చెట్టు ఎక్కడమంటేనే ఎన్నో సవాళ్లుతో కూడుకున్న పని. ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది.దీంతో ప్రమాదాల బారిన పడి వైకల్యంతో బాధపడుతున్నవారు వేల మందే ఉంటున్నారు. ఈ ఏడాది ఐదు నెల్ల కాలంలోనే 39మంది చనిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవటంతో కుటుంబం రోడ్డున పడ్డట్టైయిందని వారు వాపోతున్నారు. పథకాలెన్నిన్నా..వారి ధరికి చేరకపోవటంతో వేదనా భరిత జీవితాలను అనుభవిస్తున్నారు. రోజురోజుకు బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాడీ కార్పొరేషన్‌ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం, ఆ తర్వాత దహన సంస్కారాల కోసం రూ. 25వేల ఆర్థిక సమాయం అందించి తక్షణ ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ రకంగా ఈ కాలంలో చనిపోయిన వారికి గీత పారీశ్రామిక ఆర్థిక సహాకార సంస్థ(టాడీ కార్పొరేషన్‌) రూ.9,75,000లను అందజేసింది. ఆరోగ్య సహాయం కోసం 122 మందికి మరో రూ.18,30,000అందించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
వృత్తే ఆధారం..
             రాష్ట్రంలో గీత వృత్తిపై ఎక్కువ కుటుంబాలు ఆధార పడి బతుకుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల జనాభా సంఖ్య 15.76లక్షలు. కుటుంబాల సంఖ్య 4,66,667. సుమారు 75 లక్షల మందికిపైగా పరోక్షంగా, ప్రత్యక్షంగా జీవనం సాగిస్తున్నారు. 4,366 సొసైటీలు,3,709 టీపీటీల ద్వారా 2,18,107మంది సభ్యత్వం కలిగి వత్తి చేస్తున్నారని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్‌ ప్రారంభం నుంచి జూన్‌ నెల ఆఖరి వరకు తాటి కల్లు లభిస్తుంది. ఉదయం లేచింది మొదలు ఎండను సైతం లెక్కచేయకుండా రోజుకు మూడు సార్లు చెట్టును ఎక్కుతారు. రెక్కలు ముక్కలు చేసుకుని శారీరక బాధల్ని అనుభవిస్తూ కష్టపడతారు. ఈ కాలంలో వచ్చిన ఆదాయం తోనే వారి కుటుంబాలు ఏడాది పొడుగునా జీవనం సాగిస్తాయి. చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్‌లో డిమాండ్‌ లేక తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు.
ప్రత్యామ్నాయం కావాలి..
             రాష్ట్రంలోని గౌడ కులస్తులు తరతరాలుగా గీత వృత్తినే నమ్ముకుని బతుకుతున్నారు. ఆధునిక కాలంలో కూడా ఎత్తైన తాటి చెట్టును ఎక్కాలంటే మోకు, ముస్తాదుపైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో ఎక్కువ మంది దీనికి దూరమవుతున్న స్థితి కూడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వృత్తి నిర్వహణకోసం నైపుణ్యతతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాల్సిన అవసరం ఉందని వృత్తిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏ వృత్తికి లేని ప్రమాద సమస్యలు గీత వృత్తికి ఉండటంతో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందనే చర్చ సాగుతున్నది.
రుణాలిచ్చి ఆదుకోవాలి
             మారుతున్న కాలంతో పాటు పయనించాలన్న తపనతో యువత సాంప్రదాయంగా వస్తున్న వృత్తి పట్ల ఆసక్తి చూపటం లేదు. మరో పక్క చదువుకు తగ్గఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరకటం లేదు. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన యువత నిర్వీర్యమై తప్పుదారిపడుతున్న ఘటనలు అక్కడక్కడ సాక్ష్యాత్కరిస్తున్నాయి. మరి కొంతమంది బాధ్యత మరిచి వ్యవహరించటంతో కుటుంబానికే ఇబ్బందిగా మారుతున్నారన్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో యువతకు కార్పొరేషన్‌ద్వారా స్వయం ఉపాధికోసం రుణాలు అందించాలని కార్మికులు కోరుతున్నారు. అందుకు తగిన బడ్జెట్‌ కేటాయించి ట్యాడీ కార్పొరేషన్‌కు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని యువత అభిప్రాయపడుతున్నారు.
ఆదుకుంటున్న కార్పొరేషన్‌
             కల్లు గీత కార్పొరేషన్‌ వృత్తిదారులకు ఆలంబనగా నిలుస్తున్నది. చెట్టుపైనుంచి పడ్డవారిని మానవత్వంతో ఆదుకుంటోంది. దీంతో బాధిత కుటుంబాల్లో కార్పొరేషన్‌ కార్యకలాపాల పట్ల భరోసా ఏర్పడుతున్నది. తాటిచెట్టు ఎక్కే క్రమంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ ఏడాది ఐదు నెల్ల కాలంలోనే పెద్దమొత్తంలో గీత కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు చనిపోగా, మరికొందరు క్షతగాత్రులుగా చికిత్స పొందుతున్నారు. ఒక్కో సంఘటన ఒక్కో రకం. అన్నీ హృదయవిధారకరమైనవే. కుటుంబానికి పెద్దదిక్కైన ఆ వృత్తిదారుడు తమ నిండు ప్రాణాలను ఒదలటంతో కుటుంబ జీవనం ఆస్తవ్యస్తంగా తయారువుతున్నది. దిక్కులేని జీవచ్ఛవాలుగా మారిన ఆ కన్నీటి ముంతలకు ఆలంబనగా కార్పొరేషన్‌ నిలవటం..కాస్త ఆ కుటుంబాలకు ఉపశమనమే..
తక్షణ సహాయం అవసరమే..
             కార్పొరేషన్‌ద్వారా ప్రమాద బారిన పడ్డ వృత్తిదారులకు తక్షణం సహాయం అందిస్తున్నారు. దీంతో గీత కార్మికులు కొంత ఉపశమనం పొందుతున్నారు. తాము చేస్తున్న వృత్తి ప్రమాదమని తెలిసినా అదే చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి. ఇతర అవసరాలు తీరటం లేదు. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. జీవితాలను నిలబెట్టాలి. ఇదే సమయంలో..కార్పొరేషన్‌ను కూడా బలోపేతం చేయాలి. తగిన బడ్జెట్‌ను కేటాయించాలి.
-ఎంవీ రమణ
వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.