Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్సే రక్ష | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 08,2022

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్సే రక్ష

- హైదరాబాద్‌ను వదలండి.. జనంలో ఉండండి...
- ఢిల్లీని కాదు.. ప్రజలను నమ్ముకోండి...
- అప్పుడే మీకు టిక్కెట్లు, భవిష్యత్తు
- కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి : రాహుల్‌ గాంధీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ వదలిపెట్టి గ్రామాల్లో తిరగాలని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఢిల్లీలో బ్యాక్‌డోర్‌ పౖౖెరవీలు చేసేవారికి టికెట్లు రావన్నారు. ప్రజల్లో తిరిగేవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎంతటి సీనియర్లయినా సరే...పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు దక్కబోవని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే యుద్ధం ఉంటుందని చెప్పారు. నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్‌ను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ గెలవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులతో రాహుల్‌ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌ వెనుక ధనం, పోలీసులు మాత్రమే ఉన్నారనీ, ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయికి వెళ్లటం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, నిరంకుశత్వానికి ఏమాత్రం తావుండబోదని అన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి ప్రతి వ్యక్తికీ, ప్రతి రైతుకు వివరించాలని కోరారు. దాని గురించి చిన్న పిల్లలకు కూడా తెలియాలన్నారు. వరంగల్‌లో చెప్పింది డిక్లరేషన్‌ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందానికి అది నిదర్శనమని పేర్కొన్నారు. నాయకుల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు. అయినా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు వింటామని తెలిపారు. నాయకులు ఏ విషయాన్నైనా తనతోనే నేరుగా చర్చించాలని సూచించారు. మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఎనిమిదేండ్లుగా అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నో ఆశయాలతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారనీ, కానీ..ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జైల్లో ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించిన రాహుల్‌గాంధీ
అంతకుముందు రాహుల్‌ గాంధీ చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్‌ అయ్యారు. వారిని పరామర్శించి పార్టీ తరఫున భరోసానిచ్చారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలి.. మీ వెంట మేమున్నాం...' అని వారికి ఆయన ధైర్యం చెప్పారు. ఆయన వెంట సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. రేవంత్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతలకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు జైల్‌ బయట ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఒకరిని పరామర్శించేందుకు ముగ్గురికి అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో రాహుల్‌గాంధీకి ఏం పని అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించడాన్ని తప్పుపట్టారు.
ఉద్యమకారులతో రాహుల్‌ భేటీ
ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదంటూ పలువురు తెలంగాణ ఉద్యమకారులు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆకల సాకారం కావడం లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులతో విడివిడిగా భేటీ అయ్యారు. ప్రజాగాయకుడు గద్దర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్‌, ఫ్రొఫెసర్లు కంచె ఐలయ్య, ఇటిక్యాల పురుషోత్తం, జయెద్‌ అలీఖాన్‌తో విడివిడిగా రాహుల్‌ భేటీ అయ్యారు. ఉద్యమకారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం నేతు నక్లెస్‌రోడ్‌లోని సంజీవయ్య పార్క్‌లోని దామోదరం సంజీవయ్య 50వ వర్దంతి సందర్భంగా సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పించారు. టీపీసీసీత అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు పలువురు నేతలు ఉన్నారు.
అమరవీరుల స్మారక చిహ్నం సందర్శించిన రాహుల్‌
ట్యాంక్‌బండ్‌ అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంతాన్ని రాహుల్‌గాంధీ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరుగుతుందనీ, నిరూపిస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మీడియాతో సవాల్‌ చేసిన నేపథ్యంలో రాహుల్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీభవన్‌లో కార్యక్రమాన్ని ముగించుకుని ఆకస్మాత్తుగా అమరవీరుల స్థూపం వద్దకు రాహుల్‌ వెళ్లారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.