Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పసుపు పంచాయితీ బోర్డుకు రైతుల డిమాండ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 09,2022

పసుపు పంచాయితీ బోర్డుకు రైతుల డిమాండ్‌

- ఎంపీ అరవింద్‌ ఇంటి ఎదుట కుప్పలు పోసి నిరసన
- గతంలో ధాన్యం.. ఇప్పుడు పసుపు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
                 జిల్లాలో పసుపు బోర్డు డిమాండ్‌ మళ్లీ తెరమీదకు వచ్చింది. బోర్డు అంశం 'ముగిసిన ముచ్చట' అని ఎంపీ అరవింద్‌ ప్రకటించిన నేపథ్యంలో గత రెండేండ్లుగా బోర్డు అంశం ఊసేలేదు. కానీ ఇటీవల ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు అంశంపై ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ ముందుకు వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆదివారం ఆర్నూర్‌లోని పెర్కిట్‌లో ఎంపీ అరవింద్‌ నివాసం ఎదుట పసుపు రైతులు నిరసన చేపట్టారు. పసుపు కుప్పలు పోసి నిరసన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఎంపీ అరవింద్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్య వివాదం ముదురుతోంది. కొనేండ్లుగా స్తబ్ధుగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియామకమయిన నాటి నుంచి ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు గ్రామాల్లో అడ్డుకుంటున్నారు.
                 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీగా తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్‌ పసుపు రైతులకు వాగ్ధానం చేశారు. ఒక అడుగు ముందుకేసి బాండ్‌ పేపర్‌ కూడా రాసిచ్చారు. ఒకవేళ ఎంపీగా గెలిచిన అనంతరం పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర సర్కారు ముందుకు రాకపోతే.. రైతులతో కలిసి బోర్డు కోసం ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించారు. కానీ అరవింద్‌ గెలిచి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. బోర్డు ఏర్పాటుకు కేంద్రం అనుమతించలేదు. బోర్డు స్థానంలో స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ కార్యాలయం ఏర్పాటు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. దాంతో మళ్లీ బోర్డు ఉద్యమం తెరమీదకు వచ్చింది. గతంలోనూ బోర్డు కోసం స్థానిక రైతులు పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.
జీవన్‌రెడ్డి రాకతో మారిన ఉద్యమ తీరు..
                 టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియామకం అయిన నాటి నుంచి ఎంపీ అరవింద్‌ను గ్రామాల్లోనూ అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉద్యమాలు నిర్వహించి ఎంపీని అడ్డుకున్నారు. యాసంగి వడ్లు కేంద్రం కొనేందుకు ముందుకు రాకపోవడంతో నిరసనగా ఎంపీ ఇంటి ఎదుట రైతులు వడ్ల కుప్పులు పోసి నిరసన తెలిపారు.
                 ఇది ఇలా సాగుతుండగా.. ఎమ్మెల్సీ కవిత మొదటిసారి మూడేండ్ల తర్వాత ఎంపీ అరవింద్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పసుపు బోర్డు అంశంలో ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారంతో ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. పసుపు బోర్డు విషయంలో జిల్లా రైతులను ఎంపీ అరవింద్‌ మోసం చేశారని విమర్శలు గుప్పించారు. నేరుగా మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు గుప్పించడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం ఎంపీపై విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం చేశారు. చివరకు గ్రామాల్లో పర్యటించనీయడం లేదంటూ ఎంపీ అరవింద్‌ సీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇక తాజాగా ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలో నేరుగా ఎంపీ అరవింద్‌ ఇంటి ఎదుట పసుపు కుప్పలు పోసి రైతులు ఆందోళన చేపట్టారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.