Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బేచో ఇండియా.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 09,2022

బేచో ఇండియా..

- కేంద్ర పాలనపై మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా
- ట్విట్టర్‌ వేదికగా 'ఆస్క్‌ కేటీఆర్‌' కార్యక్రమం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
             కేంద్రప్రభుత్వం 'బేచో ఇండియా' (భారతదేశాన్ని అమ్మేయడం) స్కీం అమల్లో బిజీగా ఉందని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వబోదని అన్నారు. ఆదివారంనాడాయన 'ఆస్క్‌ కేటీఆర్‌' పేరుతో ట్విట్టర్‌ ద్వారా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వాటికాయన సమయస్ఫూర్తి, రాజకీయకోణంలో సమాధానాలు ఇచ్చారు. ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 50 పెరిగినప్పుడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ యుపీఏ ప్రభుత్వాన్ని విమర్శించారనీ, ఇప్పుడు అదే పని కేంద్రప్రభుత్వం చేస్తుంటే స్పందించకపోవడం 'హిపోక్రసీ'నే అని పేర్కొన్నారు. పెట్రోల్‌ పైన రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్‌లు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పిన మాట ఆయన ద్వంద ప్రమాణాలకు అద్దం పడుతుందని విమర్శించారు. 2014లో రూ. 410 రూపాయలు ఉన్న సిలిండర్‌ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరిందని, ఇది కేవలం మోడీ పరిపాలన వల్లనే సాధ్యం అయిందనీ, అచ్చే దిన్‌కు స్వాగతం అని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు. పెట్రోల్‌ డీజిల్‌ తో పాటు ఎల్పీజీ ధరల విషయంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌, బీజేపీ సహా అనేక ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందనీ, అయితే ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా విజయం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ''కాంగ్రెస్‌ కన్నా గట్టిగా బీజేపీని, ప్రధాని మోడీ విధానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ నిలదీస్తున్నదనీ, జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే అవకాశం ఏమైనా ఉందా?'' అని ఓ నెటిజన్‌ వేసిన ప్రశ్నకు...భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు అంటూ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారి పైన ఆశలు వదులుకున్నామనీ, సొంతంగా ఉద్యోగాల కల్పనపై ప్రయత్నాలు చేస్తున్నామని మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణకు ఐఐఎమ్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ఎన్‌ఐడీ, ఐఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఒక్క దానిని కూడా తెలంగాణకు కేటాయించలేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అడ్డగోలుగా అమ్మేస్తున్నదని విమర్శించారు. ''అదిలాబాదులో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను పున్ణ ప్రారంభించాలని మీరు కేంద్రానికి లేఖ రాసారు కదా... దానికి ఏమైనా స్పందన వచ్చిందా అని ఓ నెటిజన్‌ వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం బేచో ఇండియా పథకం కింద అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇప్పటిదాకా సీసీఐ పై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రూ.2,500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు కొనుక్కోమని చెప్పారన్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆపార్టీ నిజస్వరూపాన్ని చూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పరిశుభ్రమైన త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని ఓ నెటిజన్‌ సమస్యను ప్రస్తావించగా, మిషన్‌ భగీరథ ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లా కనెక్షన్లు ఇచ్చామనీ, ఎక్కడైనా కొరత ఉంటే 'మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామన్నారు. రీజినల్‌ రింగ్‌రోడ్‌కి సంబంధించి భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. జహీరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ప్రాజెక్టు భూసేకరణ అత్యంత కీలకమైనదనీ, దీనిపై అనేక మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్‌ఎండిఎ, టీఎస్‌ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బిల్డింగ్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉందనీ. త్వరగా దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడంలేదనీ, ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగితే చూడాలనుకుంటున్నామని ఓ నెటిజన్‌ ఆకాంక్ష వెలిబుచ్చారు. దీనిపై బీసీసీఐకి చెందిన జై షా, సౌరవ్‌ గంగూలీలని అడగాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటే అత్యంత సహనంతో కఠినంగా వర్క్‌ చేయాలని సలహా ఇచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.