Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రికార్డుల్లో చూపరు.. అధికారికంగా చెప్పరు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 09,2022

రికార్డుల్లో చూపరు.. అధికారికంగా చెప్పరు

- అస్తవ్యస్తంగా భూరికార్డులు
- నిజామాబాద్‌ జిల్లా కేంద్రం భూముల వివరాల్లేవ్‌
- పాత అధికారుల పేరుతో తప్పించుకుంటున్న వైనం
- భూ సమస్యలపై పేరుకుపోతున్న ఫిర్యాదులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
                నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భూరికార్డుల నమోదు అస్తవ్యస్తంగా, గందరగోళంగా తయారయ్యింది. పట్టా భూములు లేదా వ్యవసాయ భూముల గురించి రెవెన్యూ అధికారులను సమాచారం అడిగితే 'చూస్తాం.. లేదు.. ఇవ్వలేం' అంటూ సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఆర్‌ఓఆర్‌ రికార్డులన్నీ మాయమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ దస్త్రాల్లో అధికారికంగా తహసీల్దార్‌ కార్యాలయం స్టాంపులున్నప్పటికీ.. ఆ వివరాలు సంబంధిత కార్యాలయ రికార్డుల్లో లేకపోవడం గమనార్హం. దాంతో భూసమస్యలపై ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులు పాత అధికారుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూడటం లేదు.
                నిజామాబాద్‌ జిల్లాలో నూతన మండలాల ఏర్పాటు సమయంలో జిల్లా కేంద్రంలో ఉత్తర, దక్షిణ, గ్రామీణ ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయాల కేంద్రంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. కానీ జిల్లాలో భూముల రికార్డు పూర్తి గందరగోళంగా తయారయ్యింది. పాత రికార్డులేవి పరిశీలించినా భూముల వివరాలు వెల్లడి కావడం లేదు. 2015 నుంచి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో ఆ వివరాలు మాత్రమే ఆడపాదడపా అందుతున్నాయి. అంతకముందు వివరాలేవీ వెల్లడికావడం లేదు. రెవెన్యూ ఆఫీసర్లను తొలగించిన అనంతరం ఆ రికార్డుల సేకరణ, భద్రపరచడం సరిగ్గా చేయలేదు. గతంలో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ జరిగితే ఆర్‌ఓఆర్‌ రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. భూమి అమ్మకందారు, కొనుగోలుదారు వివరాలతో పాటు ఏ తేదీన రిజిస్ట్రేషన్‌ జరిగింది, ఎంత విస్తీర్ణంలో కొనుగోలు అమ్మకం జరిగిందన్న వివరాలన్నీ ఆ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కానీ దక్షిణ ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్‌ఓఆర్‌ రిజిస్ట్రర్‌ మాయం కావడం గమనార్హం. భూములకు సంబంధించిన వివరాలు తహసీల్దార్‌ని అడిగితే డిప్యూటీ తహసీల్దార్‌పై నెట్టేయడం, ఆయనరికార్డులు చూసే ఉద్యోగిపై నెట్టడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దక్షిణ తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఏ భూమికి సంబంధించిన వివరాలు అడిగిన మొదట 'మా కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కాబట్టి వివరాల్లేవు' అని సమాధానం వస్తోంది. 2010లో ప్రమాదం జరగగా.. 2015కు సంబంధించిన భూలావాదేవీల వివరాలు అడిగినా లభించడం లేదు. ఇదేంటని అడిగితే.. పాత తహసీల్దార్లు ఉన్న సమయంలో రికార్డుల నమోదు సరిగ్గా జరగలేదని సమాధానం వస్తోంది.
భూరిజిస్ట్రేషన్‌ సమయంలో ఎమ్మార్వో కార్యాలయ స్టాంప్‌తో పాటు పట్టా పాస్‌బుక్‌ కలిగి ఉన్న భూయజమానుల భూముల వివరాలు కూడా ఇచ్చే పరిస్థితిల్లో లేదు. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే జిల్లా కేంద్రంలో భూములకు సంబంధించిన వివాదాలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూములు 'మావంటే మావంటూ' వివాదాలు చెలరేగుతున్నాయి. ఇటీవల అధికారపార్టీలోనే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
రుణాల్లో కొర్రీలు..
                నగర విస్తరణలో భాగంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలిచి విక్రయించిన భూముల వివరాలు ప్రస్తుతం వెల్లడికావడం లేదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజానీకం ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టుకునేందుకు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే మంజూరు కావడం లేదు. ప్లాట్లు చేసేందుకు ముందు జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలు అడుగుతున్నారు. ఆ వివరాలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో లభించడం లేదు. ఫలితంగా ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని బాధితులు వాపోతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.