Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హెల్త్‌ హబ్‌గా భూపాలపల్లి జిల్లా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 10,2022

హెల్త్‌ హబ్‌గా భూపాలపల్లి జిల్లా

- రూ.102 కోట్లతో అభివృద్ధి పనులు
- జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు
- పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తాం: మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
              జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా హెల్త్‌ హబ్‌గా మారనున్నదనివైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లాలో రూ.102కోట్లతో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన పలు అభివృద్ధి పనులకు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యపరంగా ప్రభుత్వం జిల్లాలో అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నట్టు తెలిపారు. దాదాపు రూ.6కోట్లతో రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్‌మెంట్లతో 56 రకాల పరీక్షలు పైసా ఖర్చు లేకుండా చేయడానికి ఏర్పాటు చేసుకున్నామన్నారు. చిన్న పిల్లల కోసం న్యూ బార్న్‌ బేబీ కేర్‌ సెంటర్‌, ఐసీయూ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇంకా ఆల్ట్రా సౌండ్‌, మెమెగ్రఫీ, టూ డీ ఎకో వంటి పరీక్షలు ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశామన్నారు. సిటీ స్కాన్‌ మిషన్‌ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైందని, ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున 40 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లకు రూ.8కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. పీడియాట్రిక్‌ ఐసీయూ 200 పడకల ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తామన్నారు. 75 ఏండ్లలో ప్రస్తుత ప్రభుత్వం రాక ముందు భూపాలపల్లిలో ఒక్క పీహెచ్‌సీ ఉండేదని, ఇప్పుడు పీహెచ్‌సీలో 10 పడకలకు ఒక్క డాక్టర్‌ ఉంటే, మెడికల్‌ కాలేజీకి 150 మంది డాక్టర్లు, 650 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆస్పత్రుల్లో సీ సెక్షన్‌ ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారని, ఇది మహిళలకు, పుట్టే పిల్లలకు మంచిది కాదని, సాధారణ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముహుర్తాలు, మంచి రోజులు అని, ఆపరేషన్లకు బలవంతం చేస్తున్నట్టు తెలిసిందని, అలాంటివి మానుకోవాలన్నారు. ఇక్కడి జెడ్పీ చైర్‌పర్సన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ భార్య, ఎస్పీ భార్య ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగాయని గుర్తుచేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, తెలంగాణ వచ్చాక 56 శాతానికి పెరిగాయన్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు 8 జిల్లాల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని వచ్చే నెల రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, పాము కాటుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు. కరోనా సమయంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు కష్టపడ్డారని, అందుకే వారి వేతనాలు పెంచారని, ఇంకా కష్టపడితే మరింత పెంచమని సీఎంను కోరతామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్లు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మెన్‌ శ్రీనివాస్‌, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్‌ వాసుదేవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.