Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తరుగు పేరుతో దగా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 13,2022

తరుగు పేరుతో దగా

- ధాన్యం కొనగోళ్లలో మిల్లర్ల ఇష్టారాజ్యం
- క్వింటాల్‌కు 5 నుంచి 10 కేజీల కోత
- తరుగుకు అంగీకరించకపోతే కొర్రీలు
- కేజీ కూడా లెస్‌ లేదంటున్న అధికారులు
- రైతులకు మద్దతుగా తెలంగాణ రైతుసంఘం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
             ఒక్క కేజీ కూడా కోత లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. దీనికి భిన్నంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నా చూసీచూడనట్టు ఉంటోంది. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత రైతుకు ఎగుమతి దిగుమతితో ఎలాంటి సంబంధమూ లేదని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ప్రకటించినా మిల్లర్లు మాత్రం వదలడం లేదు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. కటింగ్‌కు అంగీకరిస్తేనే కొనుగోలు చేస్తున్నారని.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి ఆలస్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతింటుందనే భయంతో కటింగ్‌కు అంగీకరిస్తున్నామని చెబుతున్నారు. 17% ఉండాల్సిన తేమ 25%పైగా ఉన్నా ఎలాంటి కోత పెట్టడం లేదని, ఒకవేళ ఆ రకంగా కోత పెట్టినట్టు తమ దృష్టికి వస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ట్రక్‌ షీట్‌ కాకుండా తరుగుకు అంగీకరిస్తేనే..
             ట్రక్‌షీట్‌తో సంబంధం లేకుండా తరుగుకు అంగీకరిస్తేనే కొనుగోళ్లు చేస్తామని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తేమశాతం, నాణ్యత పేరిట పది కిలోల తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం తీసుకుంటున్నారు. గతంలో టిక్కీ ధాన్యం 41 కిలోలు ఉంటే 40 కిలోలకు డబ్బులు ఖాతాల్లో పడేవి. ఒక్క కిలో తరుగు తీసేవారు. ఇప్పుడు తొలుత 5 కిలోలు, మిల్లుల దగ్గర 10 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 91 రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఖమ్మంలో 56, భద్రాద్రి కొత్తగూడెంలో 35 మిల్లుల్లో ధాన్యం తీసుకుంటున్నారు. కాంటా పూర్తయిన తర్వాత మిల్లులకు ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. అప్పుడు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యం సేకరణ పూర్తయ్యిందంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. తరుగుకు అంగీకరిస్తే ఒకలా.. లేదంటే మరోలా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు. రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాయలేక రైతులు తెగనమ్ముకుంటున్నారు.
మిల్లుల దగ్గర వాహనాల బారులు
             ఉమ్మడి జిల్లాలో ఏ మిల్లు వద్ద చూసినా వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి. మూడు నుంచి వారం రోజుల పాటు పడిగాపులు కాయాల్సి వస్తుండటంతో ఆర్థికంగా రైతులకు భారం అవుతోంది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి, ఇటు కొణిజర్ల మండలం లాలాపురం, తల్లాడ మండలంలో పలుచోట్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో గురువారం ఓ మిల్లు వద్ద సుమారు వంద లారీలు, వంద ట్రాక్టర్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఏ మిల్లు వద్ద చూసినా కనీసం 50కి తగ్గకుండా వాహనాలుంటున్నాయి.
అధికారులు చెప్పినా అంతే..
             ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులు సూచిస్తున్నా.. మిల్లులను సందర్శించి ఆదేశాలు ఇస్తున్నా.. మిల్లర్లు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తల్లాడ మండలంలోని మిల్లులను అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో దగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు కావస్తోంది. మొత్తం 236 కేంద్రాలను తెరవాలని నిర్ణయించినప్పటికీ మే 11వ తేదీ నాటికి 216 కేంద్రాలను మాత్రమే తెరిచారు. వీటిలో 125 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 3,943 మంది రైతుల నుంచి 31,985.320 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1681 మెట్రిక్‌ టన్నులు ఎంటర్‌ చేయగా, వివిధ దశల్లో ఇంకా 838 మెట్రిక్‌ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్‌ నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో 2,42,896 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ కొనుగోళ్లు ప్రారంభమై నెల కావస్తున్నా సవాలక్ష కొర్రీల మధ్య ఇంకా 31,985 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం.
క్వింటాకు 7 కేజీల తరుగు తీశారు
             ధాన్యం కాంటా వేసి మిల్లుకు తరలించిన తర్వాత క్వింటాకు 7 కేజీల తరుగు తీశారు. కుర్నవల్లి కొనుగోలు కేంద్రం నుంచి 75 మంది రైతులు ధాన్యం విక్రయించారు. వారందరి దగ్గర ఇదే విధంగా కోత పెట్టారు. ఈ విషయాన్ని సొసైటీ చైర్మెన్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకు తెలియదంటే మాకు తెలియదంటూ తప్పించుకుంటున్నారు. జిల్లా అధికారులు ఈ విషయమై దృష్టి సారించి కటింగ్‌ లేకుండా ఖాతాల్లో నగదు జమయ్యేలా చూడాలి.
- బొగ్గుల లింగారెడ్డి, కుర్నవలి,తల్లాడ మండలం
అధికారులు చొరవ తీసుకోవాలి
             ధాన్యం కటింగ్‌, కొనుగోళ్ల విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలి. క్వింటాల్‌కు పది కేజీల చొప్పున తరుగు పేరుతో తీస్తుండటం మరీ దారుణం. కేజీ కూడా తరుగు లేకుండా చూస్తామన్న ప్రభుత్వం నిద్రాణంగా ఉండటం సరికాదు. రైతుకు ఎగుమతి, దిగుమతితో సంబంధం లేదంటూనే.. మిల్లుల వద్ద కొర్రీలు పెడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీనిపై దృష్టి సారించాలి.
- బొంతు రాంబాబు,
తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.