Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొనసాగుతున్న తప్పుల పరంపర... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 13,2022

కొనసాగుతున్న తప్పుల పరంపర...

- మారని ఇంటర్‌ బోర్డు తీరు
- ప్రశ్నాపత్రాల్లో వస్తున్న తప్పులు
- ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమం వారికి వేర్వేరు ప్రశ్నలు
- ఇంటర్‌ సెకండియర్‌ పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
           ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతున్నది. అయినా ఇంటర్‌ బోర్డులో ఎలాంటి కదలిక లేదు. పరీక్షల నిర్వహణ పట్ల, విద్యార్థుల జీవితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రతిరోజూ ఏదో ఒక తప్పు ప్రశ్నాపత్రంలో రావడం గమనార్హం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నది. రోజూ తప్పులు వస్తున్నా ఇంటర్‌ బోర్డు తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు మాత్రం ఏమీ జరగనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గురువారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పొలిటికల్‌ సైన్స్‌ (సివిక్స్‌) పేపర్‌-2 ప్రశ్నాపత్రంలో తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమం విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నలు రావడం గమనార్హం. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లీష్‌ మీడియం ప్రశ్నాపత్రంలో ఐదు మార్కులకు చెందిన ఎనిమిదో నెంబర్‌ ప్రశ్న 'పాయింట్‌ అవుట్‌ ది మెయిన్‌ ప్రావిజన్స్‌ ఆఫ్‌ ది ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1947' అని ముద్రించింది. అదే తెలుగు మాధ్యమం ప్రశ్నాపత్రంలో అదే ప్రశ్నను 'భారత స్వాతంత్య్ర పోరాటంలో హోమ్‌రూల్‌ ఉద్యమాన్ని వర్ణించండి'అన్న ప్రశ్న వచ్చింది. ఇలా ఒకే కోర్సు చదివే విద్యార్థులకు వేర్వేరుగా ప్రశ్నలు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి అనువాదంలో తప్పు జరిగిందా? లేక ప్రశ్ననే వేర్వేరుగా అడిగారా? అన్నది తెలియాల్సి ఉన్నది. అన్ని ప్రశ్నాపత్రాలనూ ఇంగ్లీష్‌ మాధ్యమంలో తయారు చేసి దాన్ని తెలుగు, ఉర్దూ మాధ్యమంలోకి ఇంటర్‌ బోర్డు అనువాదం చేసి ముద్రిస్తున్నది. కానీ పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2 ప్రశ్నాపత్రంలో వేర్వేరు ప్రశ్నలు అడగడం ఇంటర్‌ బోర్డు తప్పిదానికి నిదర్శనం.
వరుసగా ఇంటర్‌ బోర్డు తప్పులు...
           ఇంటర్‌ పరీక్షలు ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇంటర్‌ బోర్డు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నది. ఈనెల ఆరో తేదీన జరిగిన సెకండ్‌ లాంగ్వేజీ పేపర్‌-1 పరీక్షలో సంస్కృతం ప్రశ్నాపత్రంలో పలు ప్రశ్నలు పునరావృతం కావడం గమనారం. ఒక బిట్‌లో ఒక ప్రశ్న, మరో బిట్‌లో రెండు ప్రశ్నలు మొత్తంగా మూడు ప్రశ్నలు తిరిగి అవే పునరావృతం కావడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. 12వ బిట్‌లోని రెండు, 11వ ప్రశ్నలు, 13వ బిట్‌లో ఒకటి, 12వ ప్రశ్నలు, అలాగే రెండు, 11వ ప్రశ్నలు పునరావృతమయ్యాయి. ఈనెల ఏడో తేదీన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 తెలుగు ప్రశ్నాపత్రంలోనూ రెండు తప్పులు దొర్లాయి. ప్రత్యేకత అనే పదానికి బదులుగా ప్రత్యేక అని వచ్చింది. మరో ప్రశ్నలో చినుకులు అనే పదానికి బదులుగా చినుకుల అని ప్రచురితమైంది. అదేరోజు నిర్వహించిన ఉర్దూ ప్రశ్నాపత్రంలో గుల్డాన్‌ అని రావాల్సి ఉండగా, గుల్డన్‌ అని వచ్చింది. ఈనెల తొమ్మిదో తేదీన కోదాడలో సిటీ సెంట్రల్‌ పరీక్షా కేంద్రంలో హిందీ ప్రశ్నాపత్రానికి బదులు కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం రావడం సంచలనం సృష్టించింది. దీంతో గంటంపావు ఆలస్యంగా కోదాడలోని ఇతర పరీక్షా కేంద్రాలు, సూర్యాపేట నుంచి హిందీ ప్రశ్నాపత్రాలు తెప్పించి పరీక్ష రాయించడం గమనార్హం. ఈనెల 11వ తేదీన పొలిటికల్‌ సైన్స్‌ (సివిక్స్‌) పేపర్‌-1 హిందీ మాధ్యమంలో ప్రశ్నాపత్రాన్ని ముద్రించి ఇవ్వకపోవడం ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఇంగ్లీష్‌ మాధ్యమంలోని ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందించడం గమనార్హం. రెగ్యులర్‌ లెక్చరర్లు లేని కారణంగా ప్రశ్నాపత్రాలు ముద్రించలేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ప్రకటించారు. కాలేజీకి గుర్తింపు ఇచ్చి, విద్యార్థులతో ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రం ముద్రించి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఆ ప్రశ్నకు జవాబు రాస్తే మార్కులు కలుపుతాం : జలీల్‌
           ఇక గురువారం జరిగిన పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-2లో ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో వేర్వేరు ప్రశ్నకు జవాబు రాసిన విద్యార్థులకు మార్కులు కలుపుతామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లో ఏడుగురు, నాగర్‌కర్నూల్‌లో నలుగురు విద్యార్థులను మాల్‌ ప్రాక్టీస్‌ కేసుల కింద నమోదు చేశామని పేర్కొన్నారు. గురువారం పరీక్షకు 21,876 (4.9 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.