Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌లో రైతుల భూములు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌లో రైతుల భూములు

- పక్కనే ఉన్న ఎమ్మెల్యేల భూములు భద్రం
- పూణె సర్వేయర్ల బృందంతో సర్వే ొ అలైన్‌మెంట్‌ మార్పు
- ముందు ఎమ్మెల్యేల భూములివ్వాలంటున్న అన్నదాతలు
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
         పెద్దలు ఎక్కడున్నా సేఫ్‌ జోన్‌లోనే ఉంటారు.. బక్కజీవులు ఎక్కడున్నా అన్యాయానికి గురికావాల్సిందే.. లేదంటే పెద్దల సేఫ్‌ కోసం పేదలను బలిచేస్తారు.. అదీ వరంగల్‌ 'కుడా' ల్యాండ్‌ పూలింగ్‌ అలైన్‌మెంట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండ్‌ పూలింగ్‌తో రైతులకు ఉపయోగం అంటూ నమ్మబలుకుతున్న ఎమ్మెల్యేలు.. వారి భూములను ఎందుకు రక్షించుకుంటున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరం ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) మొదటి అలైన్‌మెంట్‌లో ఎమ్మెల్యేల భూములు పోకుండా అలైన్‌మెంట్‌ను మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల భూములను మాత్రమే 'కుడా' ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేకరిస్తున్న భూముల పక్కన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందల ఎకరాల భూములున్నా, ఆ భూములను మినహాయించి నోటిఫికేషన్‌లో రైతుల భూములను మాత్రమే పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి.
         గ్రేటర్‌ వరంగల్‌ నగరం చుట్టూ కాకతీయ అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) జారీ చేసిన ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న గ్రామాల్లో పెద్దలను వదిలేసి.. రైతుల భూములనే చేర్చడంతో వివాదాస్పదంగా మారింది. మూడు జిల్లాలు, మూడు నియోజకవర్గాలు, 11 మండలాలు, 27 గ్రామాల్లో 22 వేల ఎకరాలను ఓఆర్‌ఆర్‌ రెండు వైపులా సేకరించి వెంచర్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే.
పూణె నుంచి ప్రత్యేక బృందం సర్వే..
         2021 ఆగస్టులోనే పూణె నుంచి ప్రత్యేక సర్వేయర్ల బృందం వచ్చి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరెపల్లిలో సర్వే చేసింది. రైతులకు తెలియకుండానే సర్వే చేపట్టడంతో రహదారిపై అప్పట్లో రైతులు నిరసన తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఆరెపల్లికి చెందిన రైతు నాయకుడు బుద్దె పెద్దన్నతోపాటు మరో నలుగురు రైతులపై హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. నాడు ఆరెపల్లిలో మొదలైన ల్యాండ్‌ పూలింగ్‌ వ్యతిరేక ఉద్యమం ప్రస్తుతం 27 విలీన గ్రామాలకు పాకింది. వరంగల్‌ నగరం చుట్టూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. 'కుడా' సేకరించాలని భావిస్తున్న గ్రామాల్లో నలుగురైదుగురు ఎమ్మెల్యేల భూములు కూడా ఉన్నాయి. కానీ వారి భూములు మాత్రం పోవడం లేదు.
ఆరేపల్లిలో ఎమ్మెల్యే భూములు..
         వరంగల్‌ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు భూములున్నాయి. ఈ ఎమ్మెల్యే పక్కనున్న రైతుల భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో చూపించిన అధికారులు, ఎమ్మెల్యే భూములను మాత్రం నోటిఫికేషన్‌లో చూపకపోవడంలో ఆంతర్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భూములను కాపాడుకొని.. రైతుల భూములను మాత్రం లాక్కొనేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వెంటనే ల్యాండ్‌ పూలింగ్‌ జివోను రద్దు చేయాలని 27 గ్రామాల్లో రైతులు ప్రతిరోజూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.
రాంపూర్‌లో మరో ఎమ్మెల్యే భూములు
         కాజీపేట మండలంలోని రాంపూర్‌ గ్రామంలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబ సభ్యులకు భూములున్నాయి. ఈ భూములు మాత్రం ల్యాండ్‌ పూలింగ్‌లో పోకపోవడాన్ని ఆ గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేల భూములే తీసుకోవాలి.
బుద్దె పెద్దన్న- రైతు ఐక్య కార్యాచరణ సమితి- వరంగల్‌ జిల్లా కన్వీనర్‌
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భూములనే 'కుడా' ముందు తీసుకొని ల్యాండ్‌ పూలింగ్‌ చేసి రైతుల విషయం మాట్లాడాలి. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ల్యాండ్‌ పూలింగ్‌ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఈ 27 గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భూములు చాలా ఉన్నాయి. ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌లో చూపకుండా రైతుల పొట్టకొట్టి భూములను లాక్కునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపు వుంటే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాలు ఇస్తే.. నగరం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేల భూములను కాపాడుకొని, మా భూములను లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదు. ల్యాండ్‌ పూలింగ్‌ జీఓ 80ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.