Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బండిపై జనం ఈటెలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

బండిపై జనం ఈటెలు

- పాదయాత్రలో అడుగడుగునా నిలదీత
- నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ఆగ్రహం
- సంగ్రామ యాత్రకు ముగింపందుకేనా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
             'సార్‌ మీరొస్తారు. చెబుతారు. పోతారు. బాగానే ఉందికానీ మీరు మావైపు మళ్లీ చూడరు'... అంటూ ఓ మహిళా బండి సంజరుని నవ్వుతూనే అడిగేశారు. అందుకు బండి అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏ అమ్మ నీవు నాకు ఓటేయ్యకు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. సార్‌ గ్యాస్‌ ధరలు పెంచారు. పెట్రోలు, డిజీల్‌ ధరలు పెంచారు. గ్యాస్‌ వెయ్యి రూపాయలైంది. ఎట్లా బతికేది. పెట్రోలు ధర నూట ఇరవై అయింది. ఏడికన్న పోవాలంటే పోలేకపోతున్నాం. కూరగాయలు కొనలేకపోతున్నం. ఏం తినాలే..ఎట్లా బతకాలే..అని మరో చోట మహిళలు సంగ్రామ యాత్రలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వీడియో కూడా సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు చెబుతున్నప్పటికీ...బండి సంజరు యాత్రకు అడుగడుగునా ఇలాంటి పరిస్థితీ దాపురించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు...కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు ధరలను ప్రస్తావించకపోయినా, వాటితో బాధపడుతున్న ప్రజలు అనేక చోట్ల నిలదీస్తున్నారు. 2014లో గ్యాస్‌ సిలిండర్‌ రూ. 470 ఉండగా, అది నేడు రూ 1052కి చేరుకుంది. ఈ సమస్యను నేరుగా ఎదుర్కొంటున్న మహిళలు బీజేపీని కడిగిపారేస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభంలో పెద్దగా ప్రశ్నలు రాకపోయినా...మూడో విడతలో క్రమక్రమంగా బండి సంజరుకి జనం నుంచి ప్రశ్నలు ఈటెల్లా దూసుకొచ్చాయి. ఎక్కడైతే సభ జరుగుతుందో,అక్కడికి ముందుగానే బీజేపీ బృందం వెళ్లి సార్‌ చెప్పింది వినేలా మేనేజ్‌ చేశారనే ఆరోపణలున్నాయి. ఎక్కడైతే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు...అక్కడి స్థానిక నేతలు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శలున్నాయి. అసలే బీజేపీ రాజకీయంగా బలహీనంగా ఉందనేది తెలిసిందే. కొన్ని గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే వారే లేకపోవడం, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించడం, మరోవైపు ఎండ తీవ్రత పెరిగిపోవడం...ఇలా అనేక కారణాలతో బండి సంజరు ప్రజా సంగ్రామ యాత్రను ఆపేసే పరిస్థితి వచ్చిందనే టాక్‌ వినిపిస్తున్నది. మరోవైపు కమలం పార్టీలో కుతకుత ఉడుకుతున్న అంతర్గత విభేదాలు సైతం బండి యాత్రపై ప్రభావాన్ని చూపించాయని తెలిసింది. జనం లేని యాత్రతో పార్టీకి వచ్చే ప్రతిష్ట కంటే ఉన్నది కాస్త దిగిజారిపోతున్నదంటూ ఆ పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఒక గ్రూప్‌ మొత్తం బండికి సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఇలా యాత్రకు పార్టీ నుంచి పూర్తి మద్దతు లేకపోవడం, ప్రజల నుంచి ప్రశ్నల వర్షం తదితర కారణాలతో బీజేపీ యాత్రను ఆపేసిందనే వార్తలొస్తున్నాయి. ప్రజాసంగ్రామ యాత్రకు ముందుగా ప్రధాన మంత్రి మోడీ వస్తారంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత మోడీ...అమిత్‌షాను ముగింపు సభకు పంపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ రైెతాంగ సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన అమిత్‌షాకు పెద్ద ఆదరణ దక్కలేదు. అప్పుడే ఆయన బీజేపీ నేతలకు వార్నింగ్‌ కూడా ఇచ్చినట్టు సమాచారం.ఇదే తరహాలో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు కూడా ఆశించిన జనం రాలేదనే టాక్‌ వినిపిస్తున్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.