Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం

- కేసీఆర్‌ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు
- కమీషన్లు వచ్చే ప్రాజెక్టుల్నే ఆయన కడుతున్నారు
- కేంద్ర పథకాలకు పేర్లుమార్చి ప్రచారం చేసుకుంటున్నారు
- మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం...
- నా జీవితంలో ఇంతటి అవినీతి సర్కారును చూడలేదు : కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           నిజాం సర్కారును గద్దె దింపేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదనీ, దాని నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హత్యా రాజకీయాలు మొదలు పెట్టారనీ, రాష్ట్రాన్ని మరో బెంగాల్‌గా మారుస్తున్నారంటూ బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ మరణాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్‌షా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, తండ్రీ కొడుకులు (కేసీఆర్‌-కేటీఆర్‌) ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఒక్కరికీ చేయలేదన్నారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, దళితబంధు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని హామీ ఇచ్చారనీ, అవి ఎక్కడున్నాయని అడిగారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారనీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే పరిస్థితులను దిగజార్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ కింద నిధులిస్తే, దానికే 'మన ఊరు-మనబడి' అని పేరుమార్చుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందనీ, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలపై ఫామ్‌హౌజ్‌లో ఎన్నిరోజులు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. తాము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నామనీ, రేపే ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్రంలో బీజేపీ గెలుపును నిలువరించలేరని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలపొద్దన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రైతుల నుంచి బాయిల్డ్‌రైస్‌ కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కోత పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 2.50 లక్షల కోట్లను తెలంగాణ అభివద్ధి కోసం ఇచ్చామనీ, ఆ వివరాలన్నీ సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు. అంతకు ముందు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, డాక్టర్‌ కే లక్ష్మణ్‌ తదితరులు మాట్లాడారు.
బీజేపీ సభలో గద్దర్‌
           ప్రజాగాయకుడు గద్దర్‌ అనూహ్యంగా బీజేపీ బహిరంగ సభాస్థలిలో కనిపించారు. దీనిపై ఆయన్ని విలేకరులు వివరణ అడగ్గా, బెంగుళూరు కుట్ర కేసును ఎత్తేయాలని కోరుతూ కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు. అయితే భద్రతా కారణాల రీత్యా గద్దర్‌ను వేదికపైకి పోలీసులు అనుమతించలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.