Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమిత్‌ షా జీ.. మీ షోలు ఇక్కడ పని చెయ్యవ్‌... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

అమిత్‌ షా జీ.. మీ షోలు ఇక్కడ పని చెయ్యవ్‌...

- ఇది చైతన్య తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి
- రాష్ట్రానికి పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదు
- కార్పొరేట్ల చేతిలో బీజేపీ స్టీరింగ్‌
- ఆ పార్టీ నేతలు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు
- అమిత్‌ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన సభ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా... ఇక్కడకు వచ్చి షో చేసి పోయారని రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆయన షోలు ఇక్కడ పని చేయబోవని చురకలంటించారు. 'ఇది చైతన్యవంతమైన తెలంగాణ సమాజమనే విషయాన్ని గుర్తుంచుకోండి...' అంటూ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపైనా, అమిత్‌ షాపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ స్టీరింగ్‌ కార్పొరేట్‌ కంపెనీల చేతిలో ఉందనీ, ఆయా కంపెనీలు చెప్పినట్టే కేంద్రం నడుచుకుంటున్నదని విమర్శించారు. తుక్కుగూడ సభలో అమిత్‌ షా పచ్చి అబద్దాలు వల్లె వేశారని అన్నారు. ఆయన అమిత్‌ షా కాదు..అబద్దాల షా అని ఎద్దేవా చేశారు. డబుల్‌ ఇంజిన్‌ (బీజేపీ పాలిత) రాష్ట్రాల గురించి పదే పదే చెబుతున్నారు... కానీ ఆ డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ లేదు, మంచినీరు లేదని గుర్తు చేశారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇచ్చారని తెలిపారు.
అక్కడ ఐదు నెలల్లో నాలుగు సార్లు విద్యుత్‌ఛార్జీలను పెంచారని వివరించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచటం ద్వారా దేశంలోని సామాన్యుల వద్ద నుంచి ప్రధాని మోడీ రూ.26.50లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. ఆయన మిత్రులకు మాత్రం రూ.11లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. రైతుబంధు ఎప్పుడొచ్చింది? పీఎం కిసాన్‌ ఎప్పుడొచ్చింది? ఆ పథకం కింద కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర అధికంగా ఉండే దేశం భారత్‌ కాదా...? అని నిలదీశారు. దేశంలో గత 30 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందనీ, ఈ క్రమంలో భారత్‌ మరో శ్రీలంక కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం ద్వారా రిజర్వేషన్లకు శఠగోపం పెడుతున్న బీజేపీ... ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 8.50లక్షల ఖాళీలున్నాయంటూ స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారని గుర్తు చేశారు. 60 ఏండ్లలో అనేక మంది ప్రధానులు చేసిన అప్పులను.. మోడీ కేవలం ఎనిమిదేండ్లలోనే చేశారని తెలిపారు.
బహిరంగ సభలో అమిత్‌షా చేసిన విమర్శలను కేటీఆర్‌ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ఆయన ప్రసంగం... ఇనప డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే వచ్చే సౌండ్‌లాగా ఉంది తప్ప తెలంగాణకు పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదని ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో చెప్పిన తుప్పు మాటలను విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నిజానికి బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదనీ.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తే 108 చోట్ల ఆపార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పారు. 'సీఎం పదవి కావాలంటే రూ.2,500 కోట్లు ఇవ్వాలంటూ బీజేపీ అధిష్ఠానం తనను అడిగిందని కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే పాటిల్‌ యాత్నాల్‌ చెప్పారు. ఈ విషయం నేను చెబుతోంది కాదు. పత్రికల్లో కూడా వచ్చింది. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీజేపీ ఖండించలేదు.. అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతవరకు ఆయన్ను సస్పెండ్‌ చేయలేదు. వాళ్లు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, నీతిహీనులు. కర్ణాటకలో 30 శాతం కమిషన్‌ ఇవ్వనిదే ఎండోమెంట్‌ నిధులు కూడా రావంటూ ఓ హిందూ మఠాధిపతి చెప్పారు. 40 శాతం కమిషన్లు ఇస్తే తప్ప బిల్లులు రావటం లేదంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వినేవాళ్లు ఏమనుకుంటున్నారోననే సోయి కూడా లేకుండా నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి ఏదో షో చేసి పోతామంటే కుదరదు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ...' అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
'ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండంటూ అమిత్‌షా మేం కోరాం. వాటి గురించి నిజాలు చెప్పమంటే ఆయన నిజాం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్లు తలచుకున్నంతగా నిజాంను ఆయన వారసులు కూడా తలచుకోరేమో! మాట్లాడితే నిజాం, రజాకార్లు.. ఇవి తప్ప తెలంగాణకు పనికొచ్చే ముచ్చట ఒక్కటైనా చెప్పారా?తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65లక్షల కోట్లు చెల్లిస్తే.. తిరిగి వచ్చింది కేవలం రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినట్టే తెలంగాణకు కూడా ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు...' అని కేటీఆర్‌ వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.