Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళిత బంధు అందేదెప్పుడు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

దళిత బంధు అందేదెప్పుడు?

- పైలెట్‌ ప్రాజెక్టు మండలాల్లో లబ్దిదారుల ఆందోళన
- యూనిట్ల మంజూరు ప్రక్రియలో ఆలస్యం
- హార్వెస్టర్లు, జేసీబీల కొనుగోలుకు అంగీకరింపజేస్తున్న అధికారులు
- హర్యానా గేదెలు సెట్‌ కావంటున్న లబ్దిదారులు
- చింతకాని మండలంలో నత్తనడకన గ్రౌండింగ్‌
ఎస్‌. వెంకన్న
                దళితబంధు.. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరిస్తామని సీఎం ప్రకటించారు. 2021 ఆగస్టు 16న ఆ నియోజకవర్గంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం అమలు ఆశించిన మేరకు వేగంగా అమలు కావడం లేదనే అభిప్రాయం దళిత సమాజంలో వ్యక్తమవుతున్నది.దళిత బంధు కోసం రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఏడునెల్లు కావొస్తున్నా ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా పూర్తి కాలేదు. ఆయా మండలాలకు కలిపి రూ.250 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు అనుకున్న మేరకు పని కావటం లేదు. పైలెట్‌ ప్రాజెక్టు మండలాలను మినహాయించి ఆయా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం వేగంగా పూర్తవుతున్నది. దీంతో తమకు లబ్ధి ఎప్పుడు కల్పిస్తారోనని పైలెట్‌ మండలాల్లోని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'నవతెలంగాణ' ఖమ్మం జిల్లా చింతకానిలో పర్యటించిన సందర్భంగా దళిత బంధుకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఏడు నెలలు.. 25శాతం..
                గతేడాది ఆగస్టు 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ ఒకటిన రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, మండలాలను పైలట్‌ మండలాలుగా ఎంపికచేశారు. ఇందులో చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా మూడు మండలాల్లో ఒక్కో దానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదంతా జరిగి ఏడు నెల్లవుతున్నా పథకం అమలు మాత్రం నత్తనడకన సాగుతున్నది. ప్రకటనలు, ప్రచారం బాగా జరుగుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో 25శాతం కూడా అమలు కాలేదు.
లెక్కలు సరే..గ్రౌండింగ్‌లోనే జాప్యం..
                ప్రభుత్వం పైలట్‌ మండలాల ప్రకటన చేయగానే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం మండలాల్లో ఎస్సీ కుటుంబాల లెక్కలు తీశారు. అయితే ఆయా మండలాల్లో గ్రౌండింగ్‌ చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాన్ని దళితులు వ్యక్తం చేస్తున్నారు. చింతకాని మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 4,312 కుటుంబాలు, చారకొండ మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 1,267 కుటుంబాలు, తిరుమలగిరి మండలంలోని మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల 16 గ్రామపంచాయతీల్లో 2,382 కుటుంబాలు, నిజాంసాగర్‌ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 1,933 కుటుంబాలను గుర్తించారు. జిల్లా స్థాయి అధికారుల్లో ఒక్కొక్కరికీ మండలానికి ఒక్కో గ్రామ పంచాయతీ చొప్పున పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేశారు.
లబ్దిదారులే ఎంపికలో అధికారుల జోక్యం..
                పథకం అమలు తీరు, యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై ఈ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.అయితే చింతకాని మండలంలో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న పరికరాలు, ఇతరాల వాటిపై అవగాహన కల్పించే పేరుతో అక్కడక్కడ జేసీబీలు, హర్వేస్టర్లు మాత్రమే తీసుకుంటే మంచిదని అంగీకరింపజేస్తున్నట్టు తెలుస్తున్నది.పాల డెయిరీ ఎంపిక చేసుకున్న వారకి హర్యానా నుంచి గేదెలు వస్తున్నాయని చెప్పటంతో ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు 429మంది డెయిరీఫాం, 69 మంది డీజే సౌండ్‌ సిస్టం,ఫొటోగ్రపీ ఐదుగురు,సెంట్రింగ్‌ 11 మందికి లక్షన్నర చొప్పున మాత్రమే గ్రౌండింగ్‌ అయింది. ఇందులో కొందరికి రూ. 50వేలు మాత్రమే అందాయి. 11 హార్వేస్టర్లు, 16జేసీబీలకు మాత్రం పూర్తి గ్రౌండింగ్‌ అయింది. మిగతా నియోజకవర్గాల్లోని మూడు మండలాల్లో అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పించింది. కానీ.. లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ మండలాలను పథకం అమలుకు ముందుగా ఎంపిక చేసి ఊరించారనీ, యూనిట్ల మంజూరులో జాప్యం చేస్తున్నారని అక్కడి ఎస్సీలు వాపోతున్నారు.
ఎదురుచూస్తున్నాం.. వేగం పెంచాలి.
ఎం.గోపాల్‌రావుకార్యదర్శి సీపీఐ(ఎం),చింతకాని మండలం
                దళితబంధు పథకానికి చింతకాని మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయటం మంచిదే. అయితే ఇది జరిగి ఏడు నెలలు గడిచింది. ప్రభుత్వం చెప్పినంత ఈజీగా, తొందరగా గ్రౌండింగ్‌ కావటం లేదు. లబ్దిదారులు కోరుకున్న వాటిని ఇవ్వటం లేదు. అధికారులు లబ్దిదారులను కొన్నింటికి అంగీకరింపజేస్తున్నారు. షెడ్లకు రూ. 50వేలు ఇచ్చి మిగతావి మీరు పెట్టుకోండి..తర్వాత ఇస్తామని చెప్పటమేంటి? యూనిట్లను త్వరిత గతిన ఇవ్వాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.