Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మున్సిపాల్టీల్లో స్థానిక సమస్యలను పరిష్కరించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

మున్సిపాల్టీల్లో స్థానిక సమస్యలను పరిష్కరించాలి

- టీఎస్‌ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు
- మహబూబాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు భారీ ధర్నా
నవతెలంగాణ- మహబూబాబాద్‌
                'తెలంగాణ రాష్ట్రము వచ్చింది కానీ ఆశలు ఏ మాత్రం నెరవేరలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. పైగా ప్రజలపై అనేక ఆర్థిక భారాలు పడుతున్నాయి. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు,, ఇలా ఎన్నడూ లేని విధంగా పేద, మధ్యతరగతి ప్రజలను కోలుకోలేని దెబ్బ కొట్టింది' అని టీఎస్‌ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డిజి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో సోమవారం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు భారీ ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డిజి నరసింహారావు మాట్లాడారు. ఎన్నికల ముందు దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన. ప్రభుత్వ విద్యను, వైద్యాన్ని బలోపేతం చేయడం, 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్‌, కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజ్‌ ఇలాంటి వాగ్దానాలు వాగ్దానం లాగానే మిగిలిపోయాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టణ అభివృద్ధి సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాల్టీలలో సమస్యలపై సర్వేలు నిర్వహించిందని, ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకుని వాటిని వినతిపత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.
                వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాధుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహబూబాబాద్‌ పట్టణంలో 36 మున్సిపల్‌ వార్డులలో 25 బృందాలుగా ప్రజాసంఘాలు ఏర్పడి వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగిందన్నారు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లకోసం 4,500 మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరి కంటే ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. పూర్తి అయిన రెండు వందల ఇండ్లు అర్హులైన పేదలకు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు మధ్య దళారులు బేరాలు మాట్లాడుకుని లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నట్టుగా సర్వే బృందాలకు చెప్పారని వివరించారు. 59 జిఓ పేరుతో మహబూబాబాద్‌ పట్టణ ప్రజలతో వందల కోట్ల రూపాయలు కట్టించుకుని ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. అదేవిధంగా ఇల్లు లేని ప్రజలకు ఇండ్ల స్థలాలు ప్రభుత్వం ఇచ్చి 10 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
                దళిత బంధు ప్రతి పేద దళిత కుటుంబానికి ఇవ్వాలని కోరారు పెన్షన్లు రేషన్‌ కార్డులు మరుగుదొడ్లు పేదల కట్టుకున్న ఇల్లు పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్లు వేయాలని. ధరణి లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కోతుల బెడద ను నివారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కెవీపీఎస్‌ నాయకులు సూర్నపు సోమయ్య. పట్టణ అభివృద్ధి సంఘం నాయకులు సమ్మెట రాజమౌళి, మహిళా సంఘం నాయకులు గాడి పెళ్లిప్రమీల, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్‌. గిరిజన సంఘం నాయకులు భానోత్‌ సీతారాం. సీఐటియూ పట్టణ కన్వీనర్‌ కుమ్మరి కుంట నాగన్న. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హేమ నాయక్‌. డివైఎఫ్‌ఐ నాయకులు రావుల రాజు. మహిళా సంఘం పట్టణ అధ్యక్ష కార్య దర్శలు చాగంటి భాగ్యమ్మ. సూర్నాపు సావిత్ర. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గౌని వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.