Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డ్రగ్స్‌ సరఫరాలో సూత్రదారులెవరు? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

డ్రగ్స్‌ సరఫరాలో సూత్రదారులెవరు?

- అసలు నిందితులపై పోలీసుల ఫోకస్‌
- కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో నగర పోలీసుల సమన్వయం
- దేశ వ్యాప్తంగా మత్తులో పది కోట్ల మంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
                 డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాలో తరచూ సరఫరాదారులు, వినియోగదారులు మాత్రమే పట్టుబడుతున్నారు. అసలు సూత్రదారులు మాత్రం దొరకడం లేదు. దీంతో హైదరాబాద్‌ నగర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అసలు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, పది కోట్ల మంది వ్యసనానికిలోనై మత్తులో జోగుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఐదేండ్లలో విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన వారిని మాత్రమే పోలీసులు గుర్తించగలిగారు. అసలైనవారు నైజీరియా, టాంజానియా, ఉగాండా, ఆఫ్రికా దేశాల్లో ఉంటున్నారని పోలీసుల అంచనా. అక్కడి నుంచే గోవా, బెంగళూర్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబాయితోపాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు వివిధ రూపాల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేసేదెవరనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది.
కొద్ది నెలల కిందట బడా డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీని నగర పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వారం రోజుల కిందట మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యుల్లోని నలుగురిని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. 225 గ్రాముల కొకైన్‌, 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కానీ ప్రధాన సూత్రధారులు మాత్రం ఇంత వరకు చిక్కలేదు.
ఎయిర్‌పోర్టులో కిలోల కొద్దీ డ్రగ్స్‌
                 ఎయిర్‌పోర్టులో పట్టుబడుతున్న కిలోల కొద్దీ డ్రగ్స్‌ తీసుకొస్తున్న వారు సైతం తమకేమీ తెలియదని చెబుతున్నారు. మూడు నెలల్లోనే రూ.200 కోట్ల విలువ చేసే హెరాయిన్‌, కొకైన్‌ లాంటి మాదకద్రవ్యాలను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన వారిని విచారిస్తే ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇక్కడ సరఫరాదారులు మాత్రమే కాదు, వాటిని తీసుకునే వారి వివరాలు కూడా తెలియదని నిందితులు విచారణ సమయంలో అధికారులకు చెపుతుండటం గమనార్హం. డ్రగ్స్‌ తీసుకొస్తున్న వారు ఎయిర్‌పోర్టు నుంచి క్షేమంగా బయటకు వస్తేనే ఇక్కడ తీసుకునే వ్యక్తి సీన్‌లోకి ఎంటర్‌ అవుతాడు. ఆ తర్వాత నగరంలో సరఫరా చేస్తారు. అయితే, పట్టుబడుతున్న డ్రగ్స్‌ తక్కువగా ఉంటుందని, సరఫరా పెద్దఎత్తన జరుగుతోందని పోలీస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
70 శాతం పెరిగిన వినియోగం
                 ఏడేండ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం డ్రగ్స్‌ సరఫరా అయిందని ఓ సర్వేలో వెల్లడైంది. మాదక ద్రవ్యాల వాడకం వేగంగా విస్తరిస్తున్నదని పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశంలో 2014 నుంచి ఇప్పటివరకు 70 శాతం డ్రగ్స్‌ వాడకందారులు పెరిగారని, దాదాపు 10 కోట్ల మంది మత్తులో జోగుతున్నారని ఎన్‌సీబీ (నార్కోటెక్‌ కంట్రోల్‌ బ్యూరో) ఇటీవలే ప్రకటించింది.
                 ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.125 కోట్ల డ్రగ్స్‌ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. 70 శాతం ఓడరేవులు, 20 శాతం రోడ్డు రవాణా, 10 శాతం విమానాల ద్వారా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరుగుతోందని పోలీస్‌ అధికారులు గుర్తించారు. ఓడరేవుల వద్ద పటిష్ట బందోబస్తుకు, అవసరమైన టెక్నాలజీ వినియోగానికి ఆయా సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరాను అరికట్టేందుకు నగర పోలీసులు కేంద్ర, రాష్ట్ర నిఘా, దర్యాప్తు సంస్థల సమన్వయంతో ముందుకెళ్లేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈడీ, ఎన్సీబీ, సీఐఎస్‌ఎఫ్‌, కస్టమ్స్‌, డీఆర్‌ఐ వంటి ఏజెన్సీలు, పోలీసుల సమన్వయంతో పనిచేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యవస్థలతోనూ అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రయత్నం సక్సెస్‌ అయితే దేశంలో డ్రగ్స్‌ సరఫరా తగ్గే అవకాశముందని పోలీస్‌ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.