Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందనీ, రైతుల నుండి ఎలాంటి పిర్యాదులు లేవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ భవన్లో ఆయన మెదక్, సిద్దిపేట జిల్లాల్లోధాన్యం సేకరణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెంద వద్దనీ, ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. సోమవారంనాటికి 6,257 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నామనీ, 204 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యా యనీ, 2,87,000 రైతుల నుంచి రూ.3,634 కోట్ల విలువ గల 19 లక్షల మెట్రిక్ టన్నుల్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మెదక్ కలెక్టర్ హరీష్, మెదక్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.