Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు యూకే, దావోస్ లో పర్యటించనున్నారు. మే 18 నుంచి 26 వరకు కొనసాగే ఈ అధికారిక పర్యటన కోసం ఆయన బుధవారం బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం కావడంతో పాటు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ)లో రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పరిశ్రమల నాయకులకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. మే 22 నుంచి 26వ తేదీ వరకు దావోస్లో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.