Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తికి గాయాలు ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ- బాలానగర్
పిడుగుపాటుకు ఎనిమిది మేకలు మృతి చెందగా, వ్యక్తికి గాయాలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం కల్లేపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీను తన పొలంలో మేకలు మేపడానికి వెళ్లాడు. అనంతరం మందలో పంపించారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాంతో పాటు పిడుగు పడి పొలం వద్ద ఉన్న 8 మేకలు మృతి చెందగా, శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.