Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతో పాటు ఆ టపాటలు అవసరమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమె రాజ్భవన్ స్కూల్ మ్యాగజైన్ను ఆష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులు చేసిన త్యాగాలు తెలుసుకోవాలనీ, తద్వారా స్వాతంత్య్రం విలువ తెలుస్తుందని తెలిపారు. పిల్లల్లో పోషక విలువలు పెరిగేందుకు వీలుగా ఉచిత అల్పాహారాన్ని కొనసాగించాలని రాజ్ భవన్ అధికారులను ఆదేశించారు.