Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో జీవోనెంబర్ 58, 59 ధరఖాస్తుల ప్రాసెసింగ్, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణముల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటే షన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, ధాన్యం సేకరణ, దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్ తదితర అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.