Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కృష్ణా జలాలపై కేంద్రంతోపాటు కర్నాటకతో బిగ్‌ఫైట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 19,2022

కృష్ణా జలాలపై కేంద్రంతోపాటు కర్నాటకతో బిగ్‌ఫైట్‌

- ఎగువ భద్ర, ఎగువ తుంగ నిర్మాణాలతో రాష్ట్రానికి నష్టం
- సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
            కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ నిర్మాణాలను ఆపేందుకు కార్యాచరణ ప్రారంభించింది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా 12.24 టీఎంసీల నీటిని, అప్పర్‌ తుంగ ద్వారా 29.30 టీఎంసీల నిటిని వినియోగించుకునేందుకు కర్నాటక రాష్ట్రం ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నదని సమాచారం. ఈ రెండింటి పరిధిలో 3.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి ఎగువ నుంచి చుక్కనీరు కూడా రాదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎగువ తుంగ పరిధిలోని ఆరు డిస్ట్రీబ్యూ టరీల పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎఫ్‌ఐసీ పనులు ఇంకా నడుస్తున్నాయి. అలాగే ఎగువ భద్రకు సంబంధించి అన్ని పనులు వేగంగా నడుస్తున్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా కర్నాటక ముందుకు వెళ్లడం దారుణమని రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రిబ్యునళ్లు, మార్గదర్శకాలకు విరుద్ధంగా కర్నాటక వ్యవహరిస్తున్నా, ఆ నిర్ణయాల వైపే కేంద్రం మొగ్గుచూపు తున్నదనే ఆరోపణలు, విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతు న్నాయ. ఈ నేపథ్యంలో న్యాయపరంగా కర్నాటకను ఎదుర్కోంటూ ఆ రెండు ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవాలని రాష్ట్రం అంతర్గత సమాలోచనలు చేస్తున్నది. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర సాగునీటి శాఖ వ్యూహాంగా కనిపిస్తున్నది. ఇందుకు న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టు నిర్మాణానికి ఉపక్రమించిన కర్నాటక, ఎలాగైనా వాటిని పూర్తిచేస్తుందని ఆ రాష్ట్ర గత చరిత్ర తెలిసిన సాగునీటి శాఖ సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రారంభించిన రెండింటి నిర్మాణాలకు నిలిపివేయడంతోపాటు అనుమితులు ఇవ్వొద్దంటూ ఇప్పటికే కేంద్ర జలశక్తిశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణ మైతే తుంగభద్ర నుంచి కృష్ణానదిలోకి నీటి ప్రవాహం తగ్గుతుందనీ, ఆ మేరకు రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని సాగునీటి శాఖ ఉన్నతాధికా రుల అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకతో పాటు కేంద్ర జలశక్తిశాఖతోనూ కోర్టు ద్వారా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నీటి కేటాయింపులు లేకుండా ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే, ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణపై కచ్చితంగా పడుతుందని సాగునీటి శాఖ అధికారులు అంచనా. చిన్న, మధ్యతరహా ప్రాజక్టులు, లిఫ్టుల రూపంలో సుమారు 288 టీఎంసీల అదనపు నీటిని కర్నాటక వాడుకుంటున్నదనీ, 2003లోనే సాక్షాధారాలతో సహా కేంద్ర జలసంఘానికి పలు ఫిర్యాదులు, లేఖలు వెళ్లాయి. కర్నాటకతోపాటు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టులకు ఆ రాష్ట్రం సులువుగా అనుమతులు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయంగా ఉంది. ఈ తరుణంలో సుప్రీం కోర్టులో కేసు వేయడం ద్వారానే అటు కేంద్రాన్ని, ఇటు కర్నాటక రాష్ట్రాన్ని నిలువరించేం దుకు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారిక సమాచారం. అప్పర్‌ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.