Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
30 రోజుల్లో రుణమాఫీ చేస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 19,2022

30 రోజుల్లో రుణమాఫీ చేస్తాం

- కాంగ్రెస్‌ పార్టీ చరిత్రను చూసి నమ్మండి : పీసీసీ చీఫ్‌ రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
             అరవై ఏండ్లలో తమ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలెన్నో చేసిందనీ, ఆ చరిత్రను చూసి తమను నమ్మాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న విష ప్రయోగానికి లోనై కాంగ్రెస్‌ పార్టీని అనుమానంతో చూడొద్దని కోరారు. 12 నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనీ, వెంటనే 30 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు బంధు పథకాన్ని ఆగర్భ శ్రీమంతులకు ఇస్తున్నారనీ, బెంజి కార్లతో వెళ్లి రైతు బంధు తెచ్చుకుంటున్నారని చెప్పారు. అలాంటి వారికి రైతు బంధు ఇవ్వకూడదని కాంగ్రెస్‌ నిర్ణయించిందని వెల్లడించారు. రైతును బతికించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందనీ, చచ్చిపోయిన తర్వాత రూ ఐదు లక్షలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 73 వేల మందికి ఐదు లక్షల చొప్పున బీమా అందించామంటూ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసైన్డ్‌, పోడు భూములకు పట్టాలిస్తామనీ, అందుకోసం అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో రేవంత్‌ మాట్లాడారు. శ్రీలంకతో తెలంగాణ పోటీ పడే పరిస్థితి వచ్చిందనీ, ఇక్కడ కేసీఆర్‌ కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏడేండ్లలో 8,400 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతే టీఆర్‌ఎస్‌ గొప్పలు చేప్పిందని గుర్తు చేశారు. తెలంగాణలో అన్ని పంటలు పండించే భూములున్నాయనీ, ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలో, ఆ రైతును ఏ విధంగా ఆదుకోవాలో నాటి ప్రభుత్వాలు ఆలోచించాయని చెప్పారు.కేసీఆర్‌ అనాలోచిత విధానాల వల్ల రైతులు చెరుకు, పసుపు, కందులు, ఎర్రజోన్న పంటలను పండించడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా మార్చుకున్నారని చెప్పారు. అన్ని పంటలు మాయమై...వరి, పత్తి మొక్కజొన్న పంటలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రాజెక్టులను ద్వారా సాగునీరు ఇస్తున్నప్పుడు 30 లక్షలకు పంపుసెంట్లు, వాటికి ఉచిత కరెంట్‌ ఎందుకు? అని సీఎంను ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కమిషన్లు దిగమింగారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనీ, రైతు డిక్లరేషన్‌ అమలు చేయించే బాధ్యత పీసీసీ అధ్యక్షుడిగా తనదేనన్నారు. అసైన్డ్‌, పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని భరోసా ఇచ్చారు. రైతుబంధు పథకానికి, పంటలకు ముడిపెట్టబోమనీ, రైతు తనకు నచ్చిన పంట పండించుకోవచ్చనన్నారు. రైతులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైతు కమిషన్‌ నియమిస్తామని వివరించారు. భూ యాజమానికి, కౌలు రైతుకు ఎలాంటి సంబంధం లేకుండానే రైతుబంధు అమలు చేస్తామన్నారు. 'ఎన్నికల సమయంలో ఊరికెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయండి... అమలు చేసి చూపిస్తాం...అంతవరకు ధైర్యంగా ఉండండి' అని విజ్ఞప్తి చేశారు.రెండు లక్షల రుణమాఫీ చేస్తామనీ, లాంగ్‌ టర్మ్‌ లోన్ల (ఎల్‌టీఎల్‌)పై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ధరణి పరిపాలన సౌలభ్యం కోసం ఉండాలి...కానీ హైదరాబాద్‌లో వివాదస్పద భూములను తన బంధువులకు కట్టబెట్టేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తెచ్చారని ఆరోపించారు. పాత రెవెన్యూ రికార్డులను అర్థం చేసుకుని సులభతరమైన పోర్టల్‌ను కాంగ్రెస్‌ తెస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నో పథకాలను తమ పార్టీ అమలు చేసిందనీ, ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పసుపుబోర్డు కూడా ఏర్పాటుచేస్తుందన్నారు. అదిపెద్ద సమస్య కాదని చెప్పారు.60 ఏండ్లలో కాంగ్రెస్‌ అప్పులభారం మోపింది రూ 69వేల కోట్లే..కేసీఆర్‌ ఏడేండ్లలో రూ 5లక్షల కోట్లు అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. కార్యక్రమానికి వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడి, సాధిక్‌ సమన్వయ కర్తలు వ్యవహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.