Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌ బోర్డు చెలగాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 19,2022

విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌ బోర్డు చెలగాటం

- ఇంగ్లీష్‌లోనే ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు ప్రశ్నాపత్రం
- తెలుగులో ప్రశ్నలు ఇవ్వని అధికారులు
- అర్థం కాక జవాబులు రాయలేని పరిస్థితి
- ఆందోళనలో విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
               ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్‌ బోర్డు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1తోపాటు ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1, బయలాజికల్‌ సైన్స్‌ (బాటనీ, జువాలజీ) పేపర్‌-1 పరీక్షలను నిర్వహించారు. అయితే ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది వరకు ఉంటారు. వారికి ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలోనూ ఇంగ్లీష్‌, తెలుగు వర్షన్‌ అంటూ ఇచ్చారు. కానీ ప్రశ్నలు కేవలం ఇంగ్లీష్‌లో ముద్రించి ఇవ్వడం గమనార్హం. తెలుగులో ప్రశ్నలు అనువాదం చేసి ముద్రించి ఇవ్వలేదు. దీంతో ఇంగ్లీష్‌లో ఉన్న ప్రశ్నలు అర్థం కాక విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. దీంతో సరిగ్గా జవాబులు రాయలేని పరిస్థితి నెలకొన్నది. విద్యార్థుల జీవితాలతో ఇంటర్‌ బోర్డు చెలగాటం ఆడుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం. బోర్డు అధికారుల తప్పిదానికి విద్యార్థులు బలవుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి బోర్డు తప్పిదాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు.
తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలు
               బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1 ఇంగ్లీష్‌ మాధ్యమం, తెలుగు మాధ్యమం, ఉర్దూ మాధ్యమంలో తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇచ్చారు. ఏకంగా తొమ్మిది ప్రశ్నలు తప్పుగా రావడం గమనార్హం. ప్రశ్నాపత్రాల తయారీలో ఇంటర్‌ బోర్డు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది. పరీక్షా సమయంలో అధికారులు ఎర్రట పేరుతో విద్యార్థులకు ప్రశ్నాపత్రంలోని తప్పులను సరిచేయాలంటూ చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ అధికారి (డీవో)కు సమాచారం పంపించారు. బుధవారం తొమ్మిది ప్రశ్నలకు ఇంటర్‌ బోర్డు నుంచి ఎర్రటలను పంపించి సరిచేశారు. రసాయన శాస్త్రం తెలుగు మాధ్యమంలో సెక్షన్‌ ఏ ఏడో ప్రశ్న గ్రూప్‌-2ఏ మూలకాలు అని రావాల్సి ఉండగా గ్రూప్‌-2 మూలకాలు అని వచ్చింది. ఇంగ్లీష్‌ మాధ్యమంలో సెక్షన్‌ఏ 12వ ప్రశ్నలో రిలేషన్‌షిప్‌ రావాల్సి ఉంటే రిలేషన్‌ అని ముద్రించారు. సెక్షన్‌ 3లో థర్మోడైనమిక్స్‌ అని ముద్రించాల్సి ఉండగా, థర్మోడైనమీస్‌ అని వచ్చింది. సెక్షన్‌ 16లో ఎక్స్‌ప్లెయిన్‌ అని రావాల్సి ఉండగా, ఎక్స్‌పాలిన్‌ అని ముద్రించారు. సెక్షన్‌ 18లో డిఫరెన్సెస్‌ అని ముద్రించాల్సి ఉంటే డిఫరెన్స్‌ అని ఇచ్చారు. ఇంటర్‌ బోర్డు నుంచి వచ్చే ఎర్రట అంటేనే ప్రశ్నాపత్రంలో ఉన్న తప్పును గుర్తించి సరిచేయడం. కానీ ఎర్రట తప్పు వచ్చిందంటూ మళ్లీ ఎర్రట పంపించిన ఘనట ఇంటర్‌ బోర్డు అధికారులకే చెల్లుతుంది. రసాయన శాస్త్రం ఇంగ్లీష్‌ మాధ్యమంలో సెక్షన్‌ బీలోని 16,18 ప్రశ్నలకు రెండోసారి ఎర్రట పంపించారు. కామర్స్‌ తెలుగు మాధ్యమంలో సెక్షన్‌ ఈ 28వ ప్రశ్నలో డెబిట్‌ చేసిన అని రావాల్సిన చోట చెల్లించినా అని వచ్చింది. సెక్షన్‌ ఎఫ్‌ 32వ ప్రశ్న జానకి అని ముద్రించాల్సి ఉండగా, జానికి అని ఇచ్చారు. రసాయన శాస్త్రం ఉర్దూ మాధ్యమంలోనూ సెక్షన్‌ సీ 32వ ప్రశ్న తప్పుగా వచ్చింది.
ప్రశ్నాపత్రాల తయారీలో బోర్డు నిర్లక్ష్యం : రామకృష్ణగౌడ్‌
               ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీలో ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్‌) కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌ విమర్శించారు. తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జవాబులు సీరియస్‌గా రాస్తున్న సమయంలో సీఎస్‌, డీవోలు వెళ్లి విద్యార్థులకు ఎర్రట గురించి చెప్తే కొంత అశాంతి నెలకొంటున్నదని వివరించారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
నేటితో ముగియనున్న ఇంటర్‌ ప్రధాన పరీక్షలు
               ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రధాన పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈనెల ఆరో తేదీన ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1 పరీక్షలు నిర్వహించామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 4,47,295 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 4,24,438 (94.9 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 22,857 (5.1 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు. ఐదుగురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.