Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సగం ధాన్యమూ కొనలే! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

సగం ధాన్యమూ కొనలే!

- నెలరోజుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొన్నది 23.66శాతమే!
- దిగుబడి అంచనా 15లక్షల మెట్రిక్‌ టన్నులపైనే ..
- ఇప్పటివరకు సేకరించింది 3.54లక్షల మెట్రిక్‌ టన్నులే..
- కొనుగోలు కేంద్రాల్లో రైతుల అగచాట్లు
నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
                ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా దిగుబడి అంచనాలో ఈనెల 16వరకు 23.66శాతమే కొన్నారు. ప్రతిరోజూ 60 వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం సేకరిస్తున్నట్టు చెబుతున్నా.. అది లక్ష్యాన్ని చేరడం లేదు. ఒకవైపు ఆకాశంలో మబ్బులు.. మరోవైపు తీవ్ర ఎండలు రైతును ఆగం చేస్తున్నాయి. నిర్ధేశిత తేమ శాతం వచ్చినా రోజుల తరబడి వేచి ఉంటున్న రైతుల ఓపికను ఆసరా చేసుకుని 2 నుంచి 4కిలోలు అదనపు తూకం వేస్తున్నారు. వే బ్రిడ్జిపై లారీ బరువు తూకానికి.. మిల్లుకు వెళ్లాక ట్రక్‌షీట్‌లో మారుతున్న తూకానికి మధ్య తేడా రైతును నిండా ముంచుతున్నాయి.
                ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత యాసంగి 9.25లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ ఏడాది 7.7లక్షల ఎకరాలకే పరిమితమైంది. సుమారు 2లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఇక దిగుబడి సైతం గతేడాది 18లక్షల మెట్రిక్‌ టన్నులు వస్తే.. ఈ ఏడాది 15లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న ప్రభుత్వం ఈనెల 16 వరకు 3.54లక్షల మెట్రిక్‌ టన్నులు (23.66శాతం) కొనుగోలు చేశారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
                రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.40లక్షల ఎకరాల్లో వరి సాగవగా 3లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఈ జిల్లాలో 252 కేంద్రాల్లో కొనుగోళ్లు చేస్తున్న అధికారులు ఈ నెల 16 వరకు 10,140 మంది రైతుల నుంచి 129.02కోట్ల విలువజేసే 65,826 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జగిత్యాల జిల్లాలో 2.20లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసంగా 4.70లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఈ నెల 15వరకు ఈ జిల్లా వ్యాప్తంగా 8,290 మంది రైతుల నుంచి రూ.139.93కోట్లు విలువజేసే 71,395 మెట్రిక్‌టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఏడాది 1.80లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 3.50లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 వరకు 13,523 మంది రైతుల నుంచి రూ.202.72కోట్ల విలువజేసే 1,03,460 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 2.30లక్షల ఎకరాల్లో వరి సాగవగా, సుమారు 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఈ నెల 16 వరకు 16,054 మంది రైతుల నుంచి రూ.223.97కోట్ల విలువజేసే 1,14,267 మెట్రిక్‌ టన్నుల పంటను కొన్నారు.
కేంద్రాల్లో రైతుల వెతలు ఇవీ..
                ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రోజుకు 60 నుంచి 70వేల క్వింటాళ్ల వరకూ ధాన్యం సేకరిస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఐకేపీ కేంద్రాల రోజుకు 30వేల క్వింటాళ్లు.. పీఏసీఎస్‌ ద్వారా 50వేల క్వింటాళ్లు, మార్కెట్‌ కమిటీల ద్వారా ప్రస్తుతం 5వేల క్వింటాళ్ల వరకు ధాన్యం సేకరిస్తున్న తెలుస్తోంది. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో లోడ్‌ చేశాక.. మిల్లులో దింపేకంటే ముందు వేబ్రిడ్జిలో తూకం వేస్తున్నారు. ఆ వే బ్రిడ్జిలో వచ్చిన బరువును బట్టి రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేబ్రిడ్జిలో వేసిన తూకానికి, మిల్లుల ట్రక్‌ షీట్‌కు మధ్య వ్యత్యాసం ఉంటోంది. ఇక మిల్లులోనే లారీలు, ప్రయివేటు వాహనాలు రోజుల తరబడి నిలిచిపోవడంతో కేంద్రాలకు వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతోంది. దీంతో కొన్ని కేంద్రాల్లో లారీ వచ్చిన సమయంలో హమాలీలు ఉండటం లేదు. హమాలీలు వచ్చిన రోజు లారీలు సమయానికి రావడం లేదు. గన్నీ సంచి బరువు 600 గ్రాములు ఉండగా.. 40కిలోల బ్యాగులో 2 నుంచి 3కిలోలు అదనంగా తూకం వేస్తున్న పరిస్థితి దాదాపు అన్ని కేంద్రాల్లోనూ ఉంది. రోజుల తరబడి పనులు వదులుకుని కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధాన్యం నిర్ధేశిత తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయకపోవవడంతో ధాన్యం బరువు తగ్గి రైతులకు నష్టం తప్పడం లేదు. కొనుగోలు సమయం వచ్చే సరికి లారీలకు, హమాలీలకు డబ్బులు ఇవ్వాల్సి రావడం, తూకంలో తేడాలతోనూ రైతులు దోపిడికి గురవుతున్నారు. వీటికితోడు ఆకాశంలో మబ్బులు రైతులను ఆందోళనలో పడేస్తున్నాయి. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఒక పరదాకు రోజుకు రూ.30చొప్పున కిరాయి పెట్టి ఒక్కో రైతు సగటున రోజుకు రూ.100 చెల్లించాల్సి వస్తోంది. ఇలా కేంద్రంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు అంత మొత్తం చెల్లించకతప్పడం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.