Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో గతంలో రూపొందించిన 'మాస్ లైన్' బులిటెన్ మళ్లీ పార్టీ శ్రేణుల ముందుకొచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...గురువారం హైదరాబాద్లోని ఎంబీ భవన్లో దీన్ని ఆవిష్కరించారు. కలకత్తా పార్టీ ప్లీనం నిర్ణయాల అమల్లో భాగంగా మన రాష్ట్రంలో పార్టీ శాఖలు, సభ్యులకు పార్టీ నిర్మాణ సమాచారాన్ని అందించే ందుకు ఈ బులిటెన్ను 2016 నవంబరులో ప్రారంభించారు. కొంతకాల ం నడిచాక కోవిడ్ తదితర కారణాలతో దాని సర్క్యులేషన్ను నిలిపేశారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఇప్పుడు తిరిగి ప్రారంభించినట్టు తమ్మినేని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, ఆఫీసు కార్యదర్శి జె.బాబూరావు పాల్గొన్నారు.