Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోలీసు అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 21,2022

పోలీసు అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు

- యూనిఫామ్‌ సర్వీసులకు వర్తింపు
- గతంలోనే మూడేండ్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
- దరఖాస్తు గడువు 26 వరకు పొడిగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేండ్ల విలువైన కాలాన్ని తెలంగాణ నిరుద్యోగ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలంటూ టీపీసీసీ అధ్యక్షులు ఎ రేవంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలు సంఘాలు సైతం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసు అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పొడిగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని కేసీఆర్‌ ఆదేశించారు. అందుకనుగుణంగా సీఎస్‌ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలోనే యూనిఫాం సర్వీసు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచింది. దీంతో పోలీసు అభ్యర్థుల వయోపరిమితి సడలింపు ఐదేండ్లు కానుంది. పోలీసు, అగ్నిమాపక, రవాణా, జైళ్లు, ఎస్పీఎఫ్‌, ఎక్సైజ్‌, అటవీ శాఖ వంటి యూనిఫామ్‌ సర్వీసులకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు రెండేండ్లపాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ని తెచ్చింది. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తు గడువును సైతం ప్రభుత్వం పొడిగించింది. పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో 15,644 కానిస్టేబుల్‌, 554 ఎస్సై, 614 ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌, 383 కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌, 63 రవాణా కానిస్టేబుల్‌, 33 వేలిముద్రల ఏఎస్సై పోస్టులు కలిపి మొత్తం 17,291 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల రెండో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి పది గంటల వరకు దరఖాస్తు చేసేందుకు షెడ్యూల్‌ ప్రకారం గడువున్నది. అయితే అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్టు పోలీసు నియామక మండలి చైర్మెన్‌ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు పది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు సమాచారం. వయోపరిమితితోపాటు దరఖాస్తు గడువు పొడిగించడంతో మరింత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశమున్నది.
పోస్టుల వారీగా వయోపరిమితి సడలింపు
- కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ట వయస్సు 18 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 22 ఏండ్లుగా ఉన్నది. ఇకపై ఈ పరిమితి 27 ఏండ్లు అవుతుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 ఏండ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లకు పెరగనుంది.
- ఎస్సై ఉద్యోగాలకు కనిష్ట వయస్సు 21 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లుగా ఉన్నది. ఇకపై అది 30 ఏండ్లకు చేరుతుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రస్తుతం 30 ఏండ్లు గరిష్ట వయోపరిమితి ఉండగా, అది 35 ఏండ్లకు పెరగనుంది.
- డీఎస్పీ పోస్టులకు కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు. సాధారణ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లుగా ఉన్నది. ఇకపై అది 35 ఏండ్లకు పెరగనుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 35 నుంచి 40 ఏండ్లకు పెరుగుతుంది. ఇంకోవైపు డీఎస్పీ పోస్టులకు అభ్యర్థుల ఎత్తును 167 సెంటీమీటర్ల నుంచి 165 సెంటీమీటర్లకు ప్రభుత్వం తగ్గించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.