Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ఎన్‌ఈపీని రాష్ట్రాలపై రుద్దుతున్న కేంద్రం

- అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి
- లోతైన చర్చ జరగడం అవసరం
- పరీక్ష ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు
- ఆర్ట్స్‌ కాలేజీ జ్ఞానానికి ప్రతీక
- రాజకీయ నాయకులకు అనుమతి లేదు : ఓయూ వీసీ రవీందర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నది. అయినా నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించలేదు. కానీ ఎన్‌ఈపీని అమలు చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. యూజీసీ చైర్మెన్‌తో భేటీ అయినపుడు ఓయూ నుంచి కొన్ని ప్రతిపాదలు చెప్పాం. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. రాష్ట్రాలపై ఎన్‌ఈపీని రుద్దడం ఇబ్బందికరం. క్షేత్రస్థాయిలో దాని అమలుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదు. ఎన్‌ఈపీలో అనేక అంశాలపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. దానిపై లోతుగా చర్చించాల్సిన అవసరముంది. వీసీల సమావేశంలోనూ దానిపై చర్చించాం. యూజీసీ ఇస్తున్న మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్తున్నాం. డిగ్రీలో క్లస్టర్‌ విధానం అమలు అందులో భాగమే. అకడమిక్‌ బ్య్రాంక్‌ ఆఫ్‌ కెడిట్స్‌పై అధ్యయనం చేస్తున్నాం. ఆ నివేదిక వచ్చాక అమలు చేస్తాం.'అని ఓయూ వీసీ డి రవీందర్‌ చెప్పారు. వీసీగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు చేపడతామని స్పష్టం చేశారు. 2017కు ముందు పీహెచ్‌డీలో చేరిన వారు పత్రాలు సమర్పించకపోతే వాటిని రద్దు చేశామన్నారు. 2018 తర్వాత చేరిన వారు పత్రాలను 2023, జూన్‌ నాటికి సమర్పించాలని కోరారు. లేదంటే వారి పీహెచ్‌డీ ప్రవేశాలు రద్దవుతాయని చెప్పారు. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 21 పాయింట్లతో ఒక ఎజెండాను రూపొందించుకుని ప్రయాణాన్ని ప్రారంభించామని వివరించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాల బోధన, పరిశోధనల్లో వేగం, మౌళిక వసతుల అభివృద్ధి, కొంగొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులను మళ్లించటమే ప్రధాన లక్ష్యంగా వర్సిటీ పనిచేస్తున్నదని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ప్రతిసంఘటన ఆలోచనల పండుగగా మారే సంస్కృతి వైపు పయనిస్తున్నామని వివరించారు. వర్సిటీ గత వైభవాన్ని తిరిగి పొందేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా ఓయూలో సంస్కరణలు చేపడుతున్నామని అన్నారు. వర్సిటీలో విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించటంతోపాటు అకడమిక్‌ విభాగాలను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ జ్ఞానానికి ప్రతీక అని అన్నారు. అయితే అక్కడ ఉద్యమాలు, ఆందోళనలు చేయడం, పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు కట్టడం సరైంది కాదన్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో పలుమార్లు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చామనీ, స్టూడెంట్‌ కౌన్సిళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే స్టూడెంట్‌ కౌన్సిళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. ఓయూలోకి రాజకీయ నాయకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తమ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఓయూలో ఏదైనా విభాగం సమకాలీన అంశంపై ఆహ్వానిస్తే రాజకీయ నాయకులకు అనుమతి ఇస్తామని చెప్పారు. విద్యార్థులుగా చేరండి... సివిల్‌ సర్వెంట్లుగా వెళ్లండి అనే నినాదంతో ముందుకెళ్తున్నామని వివరించారు. 15, 20 రోజుల్లో సివిల్‌ సర్వీసెస్‌ అకాడమిని ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే గ్రూప్‌-1, గ్రూప్‌-2 కోచింగ్‌ ప్రారంభమైందని వివరించారు. ఏడాది కాలంలో ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సెంటర్‌ ఫర్‌ ఇండోపసిఫిక్‌ స్టడీస్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఓయూ షీ సెంటర్‌ను ఈసీ ఆమోదం తీసుకుని ప్రారంభిస్తామని అన్నారు. శతాబ్ది ఉత్సవాల వేడుకల జ్ఞాపకంగా పైలాన్‌ను ఆవిష్కరిస్తామని చెప్పారు. సంస్కరణ, పనితీరు మెరుగుకావడం, రూపాంతరం చెందడం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని అన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్‌, ప్రొఫెసర్లు మల్లేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.