Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

పేస్కేలు అడిగితే... వీఆర్‌ఏల అరెస్టులు

- ప్లకార్డులతో సీసీఎల్‌ఏ వైపు దూసుకెళ్లే యత్నం
- వాహనాల్లో కుక్కి బలవంతంగా పోలీస్‌స్టేషన్లకు తరలింపు
- జిల్లాల్లో నిర్బంధాలు... నగరశివార్లలో అడ్డగింతలు
- మహిళకు రోడ్డుప్రమాదం.. విరిగిన చేయి
- పోలీసుల పర్యవేక్షణ నడుమ సీసీఎల్‌ఏ కార్యదర్శికి వీఆర్‌ఏల జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీఆర్‌ఏలు గొంతెమ్మ కోరికలేం కోరలేదు.. 'సీఎం కేసీఆర్‌ సార్‌ పేస్కేలు ఇస్తనన్నాడు.. వారసత్వ ఉద్యోగాలిస్తనన్నాడు.. వాటిని వెంటనే అమల్లోకి తేవాలని వేడుకుంటాం.. సీసీఎల్‌ఏ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తాం' అని అనుమతి అడిగితే ప్రభుత్వం తిరస్కరించింది. హక్కులడిగితే సహించబోమంటూ పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించింది. శనివారం తలపెట్టిన వీఆర్‌ఏల చలో సీసీఎల్‌ఏ ముట్టడిని అడుగడుగునా అడ్డుకున్నది. హైదరాబాద్‌లో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వికారాబాద్‌ జిల్లా కొట్టాలగూడకు చెందిన మహిళా వీఆర్‌ఏ రోడ్డు ప్రమాదానికి గురైంది. అమె చేయి విరిగింది. తలకు గాయమైంది. సీసీఎల్‌ఏ ముట్టడి ప్రకటన నాటి నుంచే వీఆర్‌ఏలను బెదిరింపులకు దిగింది. రెండ్రోజుల ముందు నుంచే 23 వేల మంది వీఆర్‌ఏల ప్రతికదలికపైనా నిఘా పెట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ఎలాగో అలాగా తప్పించుకుని పట్నం బాట పట్టినవారిని నగరశివార్లలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఎక్కడికక్కడ అడ్డగించింది. అయినా, ఏదోరకంగా వచ్చిన వీఆర్‌ఏలను సీసీఎల్‌ఏ కార్యాలయానికి ఎటూ కిలోమీటర్‌ దూరంలో డేగకన్ను నిఘా పెట్టి ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తూ.. కనిపించినోళ్లను కనిపించినట్టుగా డీసీఎమ్‌లలో కుక్కి వందలాది మందిని పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ముసలోళ్లం మమ్ముల్ని వదలండని వేడుకున్నా కనికరించలేదు. కొందరికైతే 'ఆ ఆఫీసు ఇక్కడలేదు.. మస్తు దూరం ఉంది.. ఎండల ఏడ్కిపోతరు? ఈ చెట్టు కిందనే కూర్చోండి' అంటూ సీసీఎల్‌ఏ కార్యాలయం సమీపంలోనే ఊర్ల నుంచి వచ్చిన వీఆర్‌ఏలను కూర్చోబెట్టిన పరిస్థితి కనిపించింది. అతికష్టం మీద ఆ కార్యాలయం సమీపానికి చేరుకున్న వీఆర్‌ఏ జేఏసీ నేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకునే క్రమంలో వాగ్వివాదం చోటుచేసుకున్నది. బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. 'మేం గొడవ చేయడానికి రాలేదు...ఆఫీసుల మీద దాడి చేయడానికి రాలేదు..శాంతియుతంగా ధర్నా చేసి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నాం..దీనికి కూడా అనుమతి ఇవ్వరా? ఇదేం ధోరణి? ఇదెక్కడి న్యాయం? ఇంత నిరకుంశమా?' అంటూ జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో జేఏసీ ప్రతినిధులు ఐదారుగురు మాత్రమే వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి...పదుల సంఖ్యలో పోలీసుల బందోబస్తు మధ్య వారిని సీసీఎల్‌ఏ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. జేఏసీ ప్రతినిధులు సీసీఎల్‌ఏ కార్యదర్శి హైమావతికి వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
అనంతరం వీఆర్‌ఏ జేఏసీ చైర్మెన్‌ జి.రాజయ్య, కో-చైర్మెన్‌ రమేశ్‌ బహదూర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే దాదేమియా, కన్వీనర్‌ సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్‌కే రఫీ, వెంకటేశ్‌యాదవ్‌, గోవింద్‌, తదితరులు మాట్లాడుతూ.. 2020 సెప్టెంబర్‌ 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తెస్తున్న సందర్భంగా 23 వేల మంది వీఆర్‌ఏలందరికీ పేస్కేల్‌ ఇస్తామనీ, వారసులకు తండ్రుల స్థానంలో ఉద్యోగాలిస్తామని నిండు శాసనసభలో స్వయానా సీఎం కేసీఆర్‌ హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
20 నెలలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా సీఎం హామీ నెరవేరలేదని వాపోయారు. పేస్కేల్‌, వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అర్హత కల్గిన వారికి పదోన్నతులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో బండెడు చాకిరీ చేస్తున్న వీఆర్‌ఏలపై సర్కారు వైఖరి సరిగాదని తెలిపారు. నూటికి 90 శాతం మంది పైగా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన దళితులే ఉన్నారన్నారు. వచ్చే జీతం చాలక వీఆర్‌ఏలు కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారనీ, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పే-స్కేల్‌ జీఓ విడుదల చేయాలనీ, ఇతర పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.