Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతుల పక్షాన మాట్లాడితే కేంద్రానికి గిట్టదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

రైతుల పక్షాన మాట్లాడితే కేంద్రానికి గిట్టదు

- వారిపై ఒత్తిడి తెస్తారు ... దేశద్రోహులంటూ ముద్రేస్తారు : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             రైతుల పక్షాన మాట్లాడుతూ... వారి సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కేంద్రానికి నచ్చదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. వారిపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకొస్తారని తెలిపారు. ఈ క్రమంలో రైతు ఉద్యమ సమయంలో బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎవరెవరిపై ఎలాంటి ఆరోపణలు చేశారో అందరికీ తెలుసునని అన్నారు. రైతు నేతలను ఖలిస్థానీలు, దేశద్రోహులంటూ ముద్రేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పట్టువీడక ఉద్యమాన్ని కొనసాగించిన నాయకులందరికీ సలాం చేస్తున్నానని అన్నారు. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం పంజాబ్‌, హర్యానా లాంటి రాష్ట్రాలనుండే కాకుండా యావత్‌ భారతదేశం నుండి కూడా రైతు ఉద్యమం నడవాలని ఆయన ఆకాంక్షించారు. రైతులు పండించిన పంట విలువకు రాజ్యాంగపరమైన రక్షణ లభించేదాకా పోరాటం ఆపకూడదనీ, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఈ అంశానికి కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకి మనం మద్దతివ్వాలని అన్నారు. ఈ పరిస్థితిని సృష్టించగలిగినప్పుడు రైతు పండించిన పంటకు రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుందని సీఎం చెప్పారు.
వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఆదివారం ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చండీగఢ్‌లోని ఠాగోర్‌ స్టేడియంలో అమరులైన రైతు, సైనికుల కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఈ రోజు ఢిల్లీలో మన తలపై కూర్చున్న ప్రభుత్వం (మోడీ సర్కార్‌) వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని గుర్తు చేశారు. కాల్చుకున్న కరెంటుకు లెక్కలు వేయాలంటోందనీ, తద్వారా రక్తం పీల్చమంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం...మీటర్లు పెట్టబోమంటూ అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పిందని వివరించారు. ఏం చేసుకోవాలనుకుంటే అదే చేసుకోండంటూ తెగేసి చెప్పామని తెలిపారు. మరోవైపు మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటమనేది సంతోషకరమైన విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సందర్భమని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రానంతరం కూడా ఇలాంటి సభలు జరుపుకోవాల్సిన అగత్యం మనకు పట్టటం దారుణమని అన్నారు. దేశం ఈ విధంగా ఎందుకు ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు, ప్రతీ విషయానికి సంబంధించి ఎంతో కృషి చేయాల్సి ఉందనీ, అసలు మూలాలను, కారణాలను తెలుసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఈ దుస్థితిపై ప్రజలు పోరాడాలి, అవసరమైతే మరణించాల్సి ఉంటుంది, త్యాగాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సమస్యలున్నాయనీ, కానీ మన దగ్గరున్న సమస్యలు మరేచోటా లేవని వివరించారు. రైతు ఉద్యమంలో అమరులైన వారిని మనం తిరిగి తీసుకురాలేమనీ, కానీ యావత్‌ ప్రపంచం వారితో ఉందనే విషయాన్ని గుర్తు చేసి, సానుభూతిని ప్రకటించాలని కోరారు. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను కన్న గడ్డ పంజాబ్‌ అని ప్రశంసించారు. హరిత విప్లవాన్ని మొట్టమొదటగా సృష్టించటం ద్వారా దేశానికే అన్నం పెట్టిన గొప్ప రాష్ట్రమని చెప్పారు. గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన సంఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్‌ సంతోష్‌ బాబుతోపాటు పంజాబ్‌ సైనికులు కూడా అమరులయ్యారని గుర్తు చేశారు. రైతు ఉద్యమ సమయంలో పంజాబ్‌కు వచ్చి అమరులైన వారి కుటుంబాలను ఆదుకుందామని భావించామని అన్నారు. అయితే అక్కడ ఎన్నికలు ఉండటం వల్ల నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపట్టకూడదనే ఉద్దేశంతో రాలేదని సీఎం వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.