Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మరో డ్రామా! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

మరో డ్రామా!

- మూడు రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ హైరానా...
- పెట్రోల్‌పై రూ.11.29 పైసలు పెంచి..రూ.8 తగ్గింపు
- డీజిల్‌పై రూ.10.87 పైసలు పెంచి..రూ.7 తగ్గింపు

- ప్రయివేటు వ్యాపారులకంటే దారుణంగా మోడీ సర్కారు దోపిడీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
              ''ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రజాసంక్షేమాన్ని మాత్రమే చూస్తుంది'' ఈ ఏడాది ఫిబ్రవరి 9న పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇది. మరి పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై కేంద్రప్రభుత్వం చేస్తున్నది ఏంటి? వ్యాపారం కాదా? దేశప్రజల్ని తొలుస్తున్న ప్రశ్న ఇది. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. అదే ట్విట్టర్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ తమకు అన్నింటికన్నా దేశ ప్రజలే ముఖ్యం అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తగ్గించిన ధరలు అమల్లోకీ వచ్చాయి. ఇక బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ కేంద్ర సర్కారును, ప్రధాని మోడీని స్తుతిస్తూ 'న భూతో న భవిష్యత్‌' అన్నట్టు ప్రచారాన్ని మొదలు పెట్టింది. అసలు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర అక్షరాలా రూ. 114.49 పైసలు. డీజిల్‌ ధర రూ.109.49 పైసలు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకంటే మూడు నెలల ముందు (నవంబర్‌లో) పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సుంకం (పన్ను పరిధిలోకి రాని ఆర్థికభారం-సెస్‌) తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.20 పైసలు, డీజిల్‌ లీటర్‌ ధర రూ.94.62 పైసలు అయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10వ తేదీ వెల్లడయ్యాయి. అప్పటి వరకు ఒక్క పైసా కూడా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌పై పెరగలేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే, కేంద్రం ఏప్రిల్‌ 6 నుంచి మళ్లీ పెట్రోబాదుడు షురూ చేసింది. ఇక అప్పటి నుంచి మే 21వ తేదీ వరకు (కేవలం 45 రోజుల్లో) లీటర్‌ పెట్రోల్‌పై రూ.11.29 పైసలు (ప్రస్తుత రేటు రూ.119.49 పైసలు), డీజిల్‌పై రూ.10.87 పైసలు (ప్రస్తుత ధర రూ.105.49 పైసలు) పెంచింది. ఇప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత లీటర్‌పై రూ.11.29 పైసలు పెంచి, రూ.8 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది (ఐనా ప్రజలపై భారం రూ.3.29 పైసలు). డీజిల్‌ రూ.10.87 పైసలు పెంచి రూ.6 తగ్గించింది (ఐనా భారం రూ.4.87 పైసలు). త్వరలో గుజరాత్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిని ప్రభావితం చేయాలంటే బీజేపీకి ఏదో ఒక ప్రచార ఆయుధం కావాలి. దేశంలో ఆ పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లినా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ రేట్లపై ప్రజలు నిలదీస్తున్నారు. దానికోసమే కేంద్రం ఈ 'తగ్గింపు' నాటకానికి తెరలేపింది. ఇప్పటికీ పెట్రో ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న పన్నులు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనంత స్థాయిలో ఉన్నాయి. ఇండ్లలో వాడే వంటగ్యాస్‌ ధర రూ.1,050 చేరింది. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2వేలను ఎప్పుడో దాటేసింది. చిరు వ్యాపారులు మొదలు హౌటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆ ధర భరించలేక మొత్తుకుంటున్నారు. తినుబండారాల రేట్లు భారీగా పెరిగాయి. జనంపై మోయలేని భారాలు వేసి, కేవలం ఎన్నికల్లో లబ్ది పొందటం కోసమే తగ్గింపు డ్రామాలు ఆడుతున్న కేంద్రప్రభుత్వం చేస్తున్నది వ్యాపారమా...లేక ప్రజా సంక్షేమమా? అనే ప్రశ్నను సామాన్యులు లేవనెత్తుతున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యాక లీటర్‌ రూ.150 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని జనం వ్యాఖ్యానిస్తున్నారు!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.