Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్ నుంచి బయల్దేరిన రాష్ట్ర మంత్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సోమవారం నుంచి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పాల్గొననున్నారు. నాలుగు రోజులపాటు లండన్లో పలు ప్రముఖ సంస్థలతో ఆయన సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం లండన్లోని హిత్రో విమానాశ్రయం నుంచి ఆదివారం బయల్దేరి జ్యూరిక్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో దావోస్కి రాత్రికి వెళ్తారు. సోమవారం నుంచి అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనే మంత్రి ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమవుతారు. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు చర్చల్లో పాల్గొంటారు. తర్వాత 26వ తేదీన స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. లండన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు బయల్దేరిన మంత్రి కేటీఆర్ బృందానికి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కార్యకర్తలు వీడ్కోలు పలికారు.