Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చేబదుళ్లలో మనది రెండో స్థానం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2022

చేబదుళ్లలో మనది రెండో స్థానం

- అడ్వాన్సులు, ఓవర్‌ డ్రాఫ్టులోనూ ఘనమే
- అప్పులు పెరగటానికి కారణమిదే
- ఆదాయంతో పోలిస్తే దుబారా ఖర్చే ఎక్కువ : నిపుణులు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             'అభివృద్ధి.. సంక్షేమంలో మేమే నంబర్‌వన్‌. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పలు రంగాలు, అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచాం...' ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రభుత్వంలోని మంత్రులు, సీనియర్లు పదే పదే చెప్పే మాట ఇది. ఇదే సమయంలో అప్పులు, చేబదుళ్లు తీసుకోవటంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ తర్వాత తెలంగాణే నిలిచింది. గమ్మత్తేమిటంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా... ఆ వెనుక రెండో స్థానాన్ని తెలంగాణ ఆక్రమించింది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెన్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అత్యధిక రోజులపాటు అప్పులు చేశాయని తేలింది. ఈ సౌకర్యాలను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్టేనని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 'ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఇండియా లిమిటెడ్‌...' అనే సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ టీఆర్‌ఎస్‌ సర్కారు చెబుతూ వస్తున్నది. కానీ ఒకవైపు అప్పులు, మరోవైపు వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం తీసుకునే చేబదుళ్లు రోజురోజుకీ పెరిగిపోవటానికి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, దుబారా, అప్రధానాంశాలకు ఖర్చు పెట్టటం తదితరాలు ప్రధాన కారణమని తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆదాయానికి సంబంధించి ప్రతీయేటా సర్కారు వేసుకున్న అంచనాలు తప్పుతున్నప్పటికీ రాబడి మాత్రం యేడాదికేడాది ఎంతో కొంత పెరుగుతున్నది. మరి ఆదాయం పెరిగినప్పుడు... అప్పులు, చేబదుళ్ల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీంతోపాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ల పేరిట కూడా ఇబ్బడి ముబ్బడిగా సర్కారు అప్పులు తెస్తున్నది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం ఆయా కార్పొరేషన్ల అప్పులతో తనకేం సంబంధం లేదంటూ సర్కారు వాదిస్తున్నది. ఇది పూర్తిగా అసంబద్ధమైనదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్‌ పేరు ఏదైనా, ఏ రూపంలో అప్పు తీసుకున్నా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి వస్తుందంటూ వారు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులోనూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదే విషయాన్ని (కార్పొరేషన్ల అప్పుతో ప్రభుత్వానికి సంబంధం లేదు) పునరుద్ఘాటించారు. కానీ ఆయన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రాధాన్యతలను ఎంచుకోవటం ద్వారా దుబారాను తగ్గించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. తద్వారా చేబదుళ్లు, అప్పులు మరింత పెరక్కుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు. లేదంటే అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.