Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆదివాసీలపై అటవీశాఖ అత్యుత్సాహం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2022

ఆదివాసీలపై అటవీశాఖ అత్యుత్సాహం

- ఏండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులపై ఆంక్షలు
- కోయపోశగూడేనికి చెందిన 19 మంది ఆదివాసీ మహిళలపై కేసులు
- నిబంధనల మేరకే కేసులు నమోదు చేశామంటున్న అటవీ అధికారులు
నవతెలంగాణ-దండేపల్లి, లక్షెట్టిపేట్‌
            మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పోడు వ్యవసాయం చేస్తున్నారని ఆ గూడేనికి చెందిన 19 మంది ఆదివాసీ మహిళలను సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేసి, లక్షెట్టిపేట్‌ కోర్టుకు తరలించారు. ఈ కేసుల్లో పసిపిల్లలను సైతం తల్లులతో సహా రిమాండ్‌కు తరలించడం చర్చనీయాంశంగా మారింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వ వైద్య పరీక్షల కోసం వీరిని లక్షెటిపేట్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు సకాలంలో రాకపోవడంతో ఆదివాసీలు చాలా సేపు ఆస్పత్రి వద్ద నిరీక్షించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
            కోయపోషగూడెంలో రెవెన్యూ సర్వే నంబర్‌ 25, 26 లలో సుమారు 150 ఎకరాల భూమిని 2002, దీనికి ముందు నుండే 48 ఆదివాసీ కుటుంబాలు సాగు చేసుకుంటున్నారు. జీవనోపాధి కోసం వర్షాధార పంటలైన పెసర, కంది, మొక్కజొన్న, పంటలను తమ తాత ముత్తతల నుంచి సాగు చేసుకుంటున్నట్టు తెలిపారు. కానీ అటవీశాఖ అధికారులు తమ భూముల చుట్టూ ట్రెంచ్‌లు, నాళాలను తవ్వడంతో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2021, డిసెంబర్‌లో మంచిర్యాల ఆర్డీఓ స్వయంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములను పరిశీలించి, ప్రభుత్వం తరపున 15 రోజుల్లో పోడు వ్యవసాయ భూములకు పట్టాలు, ప్రభుత్వ భూమి ఉంటే ఇండ్ల నిర్మాణానికి సైతం స్థలాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్టు ఆదివాసీలు తెలిపారు. అప్పట్లో జరిగిన ఆందోళనలో కూడా 12 మంది ఆదివాసీలను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఆదివాసీ మహిళలు తెలిపారు. గతంలో ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, తహసీల్దార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రత్నాకర్‌ తమకు ప్రభుత్వం తరపున పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఇప్పుడు మాట మారుస్తున్నారని, నిబంధనలు అడ్డుగా వస్తున్నాయని చెబుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎఫ్‌ఎస్‌ఓ స్రవంతి, బోజన్నలు తమ పట్ల దుర్భాషలాడుతూ, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని గిరిజన మహిళలు తెలిపారు.
పట్టాలిస్తామని మోసం చేస్తున్నారు : దోశాండ్ల సునీత
            2002 నుంచి మేము సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం మా పోడు వ్యవసాయ భూములకు పట్టాలిస్తామని మోసం చేస్తోంది. మా తాతముత్తతాల నుంచి పంటలు పండించుకుంటున్నాం. ఇప్పుడు మా భూములపై మాకు హక్కులు లేవంటే మేమెలా బతకాలి. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా అటవీ అధికారులు తమను లాక్కొని రావడం ఎంత వరకు న్యాయమో అధికారులకే తెలియాలి.
మాకు జీవనోపాధి ఏది? : మోడితే పోసవ్వ
            మాకు అడవితల్లే ఆధారం. మేము అడవిని కంటికి రెప్పలా కాపాడుతాం. వర్షాధార పంటలపై భూమిని నమ్ముకుని జీవించే మమ్మల్ని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. పిల్ల, పెద్దలం అందరం అటవీ అధికారుల దాడులతో భయానికి గురవుతున్నాం. ప్రభుత్వం మా భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.
నిబంధనల మేరకే కేసులు : రత్నాకర్‌, ఎఫ్‌ఆర్‌ఓ, తాళ్లపేట్‌
            గిరిజనులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నూతనంగా పోడు సాగు చేస్తున్నారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కూడా వారిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకే అటవీశాఖ భూమిలో సాగు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.