Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీసీపీసీ కేంద్రాలను ప్రారంభించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 24,2022

టీసీపీసీ కేంద్రాలను ప్రారంభించాలి

- వికలాంగుల కోసం జిల్లాల్లో
- శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేయండి
- ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.ఐదు లక్షల సాయం అందించాలి
- కమిషనరేట్‌ వద్ద ఎన్‌పీఆర్‌డీ ధర్నా
- సమస్యలను పరిష్కరిస్తామని అధికారుల హామీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
            వికలాంగుల కో-ఆపరేటీవ్‌ కార్పొరేషన్‌ బలోపేతం చేయాలనీ, మూసేసిన ట్రైనింగ్‌ కం ప్రొడక్షన్‌ సెంటర్స్‌ (టీసీపీసీ) కేంద్రాలను ప్రారంభించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్‌ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని కోరింది. వికలాంగులకు ఎలాంటి షూరిటీ లేకుండా రూ.ఐదు లక్షల సాయం చేయాలని డిమాండ్‌ చేసింది.వీటితోపాటు ప్రతి జిల్లాల్లో స్టడీ సర్కిల్‌ ఏర్పాటుచేయాలనే పలు డిమాండ్ల సాధన కోసం సోమవారం హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ వికలాంగుల శాఖ కమిషనరేట్‌ వద్ద ఎన్‌పీఆర్‌డీ ధర్నా నిర్వహించింది. అనంతరం వికలాంగుల కార్పొరేషన్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజ, జనరల్‌ మేనేజర్‌ ప్రభంజన్‌రావుకు ఎన్‌పీఆర్‌డీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్టెట్‌ కేటాయింపుల్లో తగిన నిధులు కేటాయించకుండా వికలాంగుల కార్పొరేషన్‌ పట్ల వివక్ష చూపుతుందని విమర్శించారు. నిధులు కేటాయించకపోవడంతో వారికి సౌకర్యాలు అందడం లేదన్నారు. కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారిందని చెప్పారు. సూర్యాపేట, నిజామాబాద్‌, రంగారెడ్డి, సదాశివ పేట, హైదరాబాద్‌లో ఉన్న టీసీపీసీ కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి, హైదరాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల్లో మూసేశారనీ, వాటిని వెంటను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. మూడు కేంద్రాల్లో క్యాలిఫర్స్‌ తయారు చేసే కేంద్రాలు ఉన్నప్పటికి అవి ఎక్కడా సరిగా పని చేయడం లేదని తెలిపారు. నల్లగొండలో స్థలం లేదనే కారణంగా కేంద్రాలు మూసేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కోఠి ఈఎన్‌టీలో ఉన్నటువంటి హియరింగ్‌ మౌల్డ్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన శిశువుకు హియరింగ్‌ టెస్టు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సౌండ్‌ లైబ్రరీలో అవసరమైన సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. బధిరులు, ఆంధుల కోసం ప్రత్యేక పథకాలను కార్పొరేషన్‌ అమలు చేయాలన్నారు. వికలాంగుల కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో మూసేసిన చాక్‌పిక్‌ తయారీ కేంద్రం ప్రారంభించాలనీ, మహిళా వికలాంగుల కోసం కుటిర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ట్రైనింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తీవ్ర వైకల్యం కలిగిన వారికి బ్యాటరీవీల్‌ చైర్స్‌ ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలనీ, చదువుతోనిమిత్తం లేకుండా మోటారైజ్డ్‌ స్కూటర్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయడంతోపాటు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యం కల్పించాలన్నారు. బధిరులకు 4జి ఫోన్స్‌, ఆంధులకు ల్యాప్‌టాఫ్స్‌ పంపిణీ చేయాలన్నారు. పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనే నిబంధనను ఎత్తివేసి, దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పరికరాలు అందించాలని కోరారు. 2016 ఆర్‌పీడీ చట్టం సెక్షన్‌ 35 ప్రకారం ప్రయివేటు పరిశ్రమల్లో ఐదు శాతం ఉపాధి కల్పనకు కృషి చేయాలన్నారు. అంధులకు ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన కెన్‌స్టిక్స్‌ పంపిణీ చేయాలని కోరారు. బహుళ వైకల్యం కలిగిన వారికి ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా వైకల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వికలాంగుల కార్పొరేషన్‌ను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి మధుబాబు, సహాయ కార్యదర్శులు బాలీశ్వర్‌, ఉపేందర్‌, సభ్యులు రంగారెడ్డి, సాహిన్‌బేగం, ప్రకాశ్‌, లలిత, భుజంగరెడ్డి, రాజశేఖర్‌గౌడ్‌, ప్రభుస్వామి, శశికళ, మల్లేష్‌తోపాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.