Fri May 16, 2025 06:48:13 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతాంగం స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 25,2022

రైతాంగం స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు

- ఎన్‌ఈపీ, సీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం
- ధరల పెరుగుదలపై 27,28 తేదీల్లో నిరసనలు
- టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
             దేశంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగించిన వీరోచిత పోరాటం స్ఫూర్తితో విద్యారంగంతోపాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ), కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం (సీపీఎస్‌)కు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈనెల 27,28 తేదీల్లో జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 20,21,22 తేదీల్లో విజయవాడలో ఎస్టీఎఫ్‌ఐ జాతీయ మహాసభ జరిగాయని వివరించారు. విద్యారంగ సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించామన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశామని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం అమలు పేరుతో విద్యారంగాన్ని వ్యాపారీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ దిశగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పేదలకు విద్యను మరింత దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నానో టెక్నాలజీవైపు ప్రపంచం వెళ్తుంటే, భారత్‌ మాత్రం పురాణాలు, మతఛాందస భావాలను విద్యార్థుల మనసుల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. ధరలను నియంత్రించడంలో విఫలమైన కేంద్రం భావోద్వేగాలను పెంచడం, మత విభజనను రెచ్చగొట్టడం, ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 25 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఎస్టీఎఫ్‌ఐ మహాసభ తీర్మానించిందని చెప్పారు. జాతీయ విద్యావిధానం అమలును నిలిపివేయాలనీ, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వచ్చేనెలలో జిల్లా కేంద్రాలు, జులై మొదటివారంలో రాష్ట్ర కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అదేనెల 17న ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తామని వివరించారు. విద్యారంగంలో ఖాళీపోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఐదు లక్షలకు, పొదుపు మొత్తాలపై రాయితీని రూ.మూడు లక్షలకు పెంచాలని కోరారు. మత సామరస్యం, జాతీయ సమైక్యతను కాపాడాలన్నారు. 317 జీవో అప్పీళ్లు, 13 జిల్లాల్లో స్పౌజ్‌ కేసులను పరిష్కరించాలన్నారు. సీనియార్టీ సమస్యలు, పరస్పర బదిలీల దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు. గెజిటెడ్‌ హెచ్‌ఎం వరకు యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్టీఎఫ్‌ఐ ఉపాధ్యక్షులుగా చావ రవి, ఎం సంయుక్త, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా సిహెచ్‌ దుర్గాభవాని, కేంద్ర కమిటీ సభ్యులుగా కె జంగయ్య, వి శాంతికుమారి ఎన్నికయ్యారని వివరించారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ శారద మాట్లాడుతూ మహిళల్లో నాయకత్వ ప్రతిభను పెంపొందించేందుకు స్టడీసర్కిళ్లు, సెమినార్లు నిర్వహిస్తామని చెప్పారు. విద్యద్వారానే మహిళల సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ విద్యావిధానం అమలు బాలికల విద్యకు గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగికదాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.