Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర విద్యాశాఖ నూతన కార్యదర్శిగా బాధ్య తలు స్వీకరించిన వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్లోని సచివాల యంలో టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను కార్యదర్శి దృష్టికి వారు తెచ్చారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తన సంపూర్ణ సహకారాన్ని అందజేస్తానని ఆమె వారితో చెప్పారు.