Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డిగ్రీ కాలేజీలపై వేటు! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

డిగ్రీ కాలేజీలపై వేటు!

- సున్నా ప్రవేశాలున్న 54 కళాశాలల మూసివేత
- మూడేండ్లుగా ఇదే పరిస్థితి

- 15 మందిలోపు విద్యార్థులున్న కోర్సులు రద్దు
- వీసీలకు ఉన్నత విద్యామండలి ఆదేశం
- కన్వర్షన్‌కు 130 కాలేజీల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలపై వేటుకు రంగం సిద్ధమైంది. 54 ప్రయివేటు డిగ్రీ కళాశాలల్లో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయి. మూడు విద్యాసంవత్సరాలుగా వాటిలో ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం. విద్యార్థులు చేరకుంటే చర్యలు తీసుకుంటామంటూ ఏటా ఉన్నత విద్యామండలి కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా వాటి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో 54 డిగ్రీ కాలేజీలను మూసివేయాలనీ, లేదంటే వచ్చే విద్యాసంవత్సరం (2022-23)లో అనుబంధ గుర్తింపును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వీసీలకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల భవనాలు, తరగతి గదులు, మౌలిక వసతులు, అర్హులైన అధ్యాపకులు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో విద్యార్థులెవరూ చేరేందుకు ముందుకు రావడం లేదు. వాటిలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాల్లేవు. ఇంకోవైపు డిగ్రీ కాలేజీలు ప్రమాదంలో పడ్డాయి. 30 మంది విద్యార్థుల్లోపు 184 కాలేజీలు, 50 మంది విద్యార్థుల్లోపు సుమారు 250 కాలేజీలుండడం గమనార్హం. ఇంకోవైపు 15 మంది విద్యార్థులున్న కోర్సులను సైతం రద్దు చేయాలని నిర్ణయించింది. ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేయాలంటూ వీసీలను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. విద్యార్థులు తక్కువున్న కోర్సులను కన్వర్షన్‌ చేసుకునేందుకు సుమారు 130 కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశాయి. ఆయా కాలేజీలున్న ప్రాంతాలు, వాటి పనితీరు, అవసరం, విద్యార్థుల ప్రవేశాల ఆధారంగా వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
భారీగా మిగులుతున్న సీట్లు
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. అందులో ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లోనే ఎక్కువ మిగులుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2021-22)లో 1065 డిగ్రీ కాలేజీల్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 2,73,526 (58.65 శాతం) మంది విద్యార్థులు చేరారు. 1,92,819 (41.35 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలో గురుకులాలతో కలిపి 187 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 878 ప్రయివేటు డిగ్రీ కాలేజీలున్నాయి. 878 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 3,39,110 సీట్లుంటే, 1,74,596 (51.43 శాతం) మంది విద్యార్థులు చేరారు. 1,64,714 (48.57 శాతం) సీట్లు మిగిలాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 1103 డిగ్రీ కాలేజీల్లో 4,54,703 సీట్లకుగాను 2,47,601 మంది ప్రవేశం పొందారు. అంటే 2,07,102 సీట్లు మిగిలాయి. ఇందులో 855 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 3,36,070 సీట్లకుగాను, 1,73,550 (51.64 శాతం) మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 1,62,520 (48.36 శాతం) సీట్లు మిగిలాయి.
వంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు : లింబాద్రి
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 70 శాతం వరకు సీట్లలో విద్యార్థులు చేరుతున్నారని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావడం, కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, అధ్యాపకులను అందుబాటులో ఉంచడం, మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. తెలంగాణ వచ్చిన సమయంలో 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు ఉండేందన్నారు. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల వల్ల ప్రస్తుతం వంద కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు ఉందని చెప్పారు. నిజాం, సిటీ, కోఠి, బేగంపేట మహిళా కాలేజీల్లో డిగ్రీ విద్యార్థులు 70 నుంచి 80 కోర్సుల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అన్నారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానం వల్ల ఆర్ట్స్‌ విద్యార్థులు, సైన్స్‌ సబ్జెక్టులను, సైన్స్‌ విద్యార్థులు ఆర్ట్స్‌, కామర్స్‌ కోర్సులను ఎంచుకునేందుకు అవకాశముందని చెప్పారు. కరోనా సమయంలోనూ రాష్ట్రంలో 2,73,526 మంది విద్యార్థులు చేరడం మంచి పరిణామమని అన్నారు. విద్యార్థులు చేరిక రాష్ట్ర గ్రాస్‌ ఎన్‌రోల్‌మెట్‌ రేషియో (జీఈఆర్‌) పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.