Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 26,2022

రైల్వేలో కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఎత్తివేయాలి

- ఇప్పుడున్న 8 లక్షల మంది కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
- ప్రయివేటీకరణ వద్దు
- డిమాండ్ల సాధన కోసం ఐక్యపోరాటాలు
- నేడు ఎస్వీకేలో అఖిలభారత ప్రతినిధుల సమావేశం
- 'నవతెలంగాణ'తో రైల్వే కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌
కోఆర్డినేషన్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌ దిట్టకవి రమేష్‌బాబు
            ''రైల్వేలో కాంట్రాక్ట్‌ కార్మికుల శ్రమదోపిడీకి అడ్డూ అదుపూ లేదు. సంఘటితం అయ్యే ప్రయత్నం చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. తీవ్రమైన నిర్భంధాల మధ్య, కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు 8 లక్షల మంది కార్మికులు కాంట్రాక్టర్ల ద్వారా రైల్వేలో పనిచేస్తున్నారు. వీరందరినీ పర్మినెంట్‌ చేయాలి. అన్ని ఖాళీ పోస్టుల్ని తక్షణం భర్తీ చేయాలి. దానికోసం త్వరలో రైల్వేమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కచ్చితంగా రైల్వేలో కాంట్రాక్ట్‌ కార్మికులకు న్యాయం జరిగి తీరాలి. దానికోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటాం'' రైల్వే కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ అఖిల భారత కన్వీనర్‌ దిట్టకవి రమేష్‌బాబు నిశ్చితాభిప్రాయాలు ఇవి. గురువారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరగనుంది. పలు రాష్ట్రాల ప్రతినిధులు దీనిలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికుల స్థితిగతులపై ఆయన తన అభిప్రాయాలను 'నవతెలంగాణ'తో పంచుకున్నారు.
రైల్వేలో కాంట్రాక్ట్‌ కార్మికుల పనివిధానం ఎలా ఉంది?
దారుణంగా ఉంది. వారికి కనీస వేతనాలు, సౌకర్యాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, బోనస్‌ వంటివి ఏవీ లేవు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కనీస నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. రైల్వేకు సంబంధం లేదంటున్నారు. పూర్తిగా శ్రమదోపిడీ జరుగుతుంది. ఇదేమని ప్రశ్నిస్తూ, ఎక్కడైనా కార్మికులు సంఘటితమయ్యే ప్రయత్నం చేస్తే, నిర్దాక్షిణ్యంగా వారిని పనిలో నుంచి తొలగిస్తున్నారు. ఆ భయానికి కాంట్రాక్ట్‌ కార్మికులు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా, కండ్లలో నీళ్లు కుక్కుకుంటూ వెట్టిచాకిరీ చేస్తున్నారు.
మరి రైల్వే మంత్రిత్వశాఖ ఏం చేస్తుంది?
ప్యాకేజీల వారీగా రైల్వే పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించి, చేతులు దులుపుకుంటోంది. కనీసం రైల్వే అధికారుల వద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల రిజిస్టర్‌ కూడా లేదు. కనీస సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించట్లేదు. దాన్ని గుర్తు చేయడం కోసమే ఇప్పుడు మేం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. దానిలో భాగంగా తొలుత రైల్వేమంత్రికి కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు, డిమాండ్లు, పరిష్కారాలను సూచిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఏఏ విభాగాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు?
ఏసీ కోచ్‌లు, రైల్వే స్టేషన్ల పరిశుభ్రత, గూడ్స్‌ షెడ్‌లు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తున్న రైల్వే క్యాంటీన్లు, సివిల్‌ వర్క్‌లు సహా పలు విభాగాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు.
మహిళా కాంట్రాక్ట్‌ వర్కర్ల పరిస్థితి ఎలా ఉంది?
దుర్భరంగా ఉంది. అవమానాలు, వేధింపులు, కన్నీళ్ల దిగమింగుకొని పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రైల్వే కాంట్రాక్టర్లు, అధికారులు వారిని లైంగిక వేధింపులకూ గురిచేస్తున్నారు. వారికోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు వంటివి లేవు. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వారు చేతులతోనే చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కనీసం గ్లౌజులు, చీపుర్లు కూడా ఇవ్వట్లేదు. అదేమని ప్రశ్నిస్తే రేపటి నుంచి పనికి రావొద్దు అని నిర్దయగా చెప్పేస్తున్నారు.
యూనియన్లుగా మీరేం చేస్తున్నారు?
మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు రైల్వేలో కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘాల నిర్మాణమే మాముందున్న అతిపెద్ద సవాలు. ఎవరైనా సంఘ కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిస్తే, తెల్లారే వాళ్లను పనుల్లోంచి తీసేస్తున్నారు. ఇతర యూనియన్లతో కలిసి ఐక్య కార్యాచరణకూ ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో మార్పు తెస్తేనే, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఎంతోకొంత న్యాయం జరుగుతుంది. మా ప్రయత్నం ఆ దిశగా సాగుతున్నది.
మీ డిమాండ్లు ఏంటి ?
కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వాలి. సర్వీసుల్ని రెగ్యులరైజ్‌ చేయాలి. పని ప్రదేశాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్ట్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి.
కేంద్రప్రభుత్వం రైళ్లు, రైల్వే స్టేషన్లనే ప్రయివేటుపరం చేస్తుంటే, మీ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల్ని వింటారా?
రైల్వేను ప్రయివేటుపరంచేస్తూ చేతులు కాల్చుకుంటున్నా కేంద్రానికి ఇంకా గుణపాఠం రాలేదు. ఢిల్లీ - లక్నో మధ్య తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రయివేటు రైళ్లను ప్రవేశపెట్టారు. వాళ్లు టిక్కెట్‌ రేట్లు విపరీతంగా పెంచడంతో ప్రజలు ఆ రైళ్లు ఎక్కడం మానేశారు. దీనితో నష్టాలు వస్తున్నాయని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలే అనేకం జరిగాయి. అయినా కేంద్రానికి కనువిప్పు కలగట్లేదు. మరో రూపంలో మళ్లీ ప్రయివేటుకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంది. కేవలం లాభాలు వచ్చే రూట్లనే ప్రయివేటుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
రైల్వేలో ఖాళీ పోస్టుల భర్తీ జరుగుతున్నదా?
లేదు. ఈ విషయాన్ని స్వయానా రైల్వేమంత్రే పార్లమెంటుకు తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ కేడర్‌లో 1.49 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. గ్రూప్‌-సీ, డీ కేటగిరీల్లో 2019 నుంచి రిక్రూట్‌మెంటే లేదు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఖాళీలు ఉంచి, ఆ పనుల్ని కాంట్రాక్లర్లకు ఇచ్చి, కాంట్రాక్ట్‌ వర్కర్లతో చేయించుకుంటోంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నియామకాల ప్రక్రియ సుదీర్ఘమైంది. ఒక్క పోస్టు భర్తీ చేయాలంటే కనీసం రెండేండ్లు టైం తీసుకుంటుంది. ఈ విధానంలో మార్పు రావాలి.
హైదరాబాద్‌లో జరిగే నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు?
కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు, పరిష్కారాలు, యూనియన్‌ విస్తరణ, ఎదురయ్యే అవరోథాలు, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ చర్చల సారాంశాన్ని, ప్రతిపాదనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి కార్యాచరణను రూపొందిస్తాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.