Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దళితుల భూములు లాక్కోవద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 28,2022

దళితుల భూములు లాక్కోవద్దు

- బాధితులకు అండగా నిలిచి పోరాడుతాం
- బెదిరింపులకు తలొగ్గేది లేదు: సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె.భాస్కర్‌
- ప్రాణం పోయినా సరే భూమి ఇచ్చేది లేదు : బాధితురాలు భారతమ్మ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు పేద దళితుల భూములను అక్రమార్కులు దౌర్జన్యంగా లాక్కుంటుంటే అడ్డుకోవాల్సింది పోయి వారికి మద్దతుగా ఉంటూ దళితులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్‌ హెచ్చరించారు. ఎన్నో ఏండ్లుగా తరతరాలుగా భూములు దున్నుకుని జీవనం సాగిస్తున్న దళితుల భూములపై అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు కన్నేసి లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దళితులకు తమ భూమి దక్కేవరకు సీపీఐ(ఎం) వారికి అండగా ఉండి పోరాడుతుందన్నారు. శుక్రవారం భూ బాధితులు బాబు, భాస్కర్‌ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కె. భాస్కర్‌ మాట్లాడారు. దళితుల వెట్టిచాకిరీ ఫలితంగా నాటి జామీందార్లు వారికి భూములను అసైన్డ్‌ చేశారనీ, అప్పటినుంచి ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. సర్వే నెంబర్‌ 46లో 24 ఎకరాలు, 61 సర్వే నెంబర్‌లో 32 ఎకరాలు దళితల చేతుల్లో ఉండేదన్నారు. ఈ భూములను క్రమక్రమంగా ప్రభుత్వం నాలాల కింద కొంత భూమి తీసుకుందని తెలిపారు. 1993లో పేదలకు ఇండ్ల స్థలాల పేరుతో మరో కొంత భూమి లాక్కుందన్నారు. దీనిపై హైకోర్టులో కేసు వేస్తే.. దళితులను అక్కడి నుంచి తొలగించవద్దని 1999లో ఆర్డర్‌ ఇచ్చిందని చెప్పారు. కానీ హైకోర్టు ఆర్డర్‌ను బేఖతారు చేస్తూ కొంత మంది రాజకీయ నాయకుల అండతో న్యాయవాది వృత్తిలో ఉన్న తులసీదాస్‌ అనే వ్యక్తి రీక్షాపుల్లర్స్‌ అసోసియేషన్‌ పేరుతో రీక్షాకార్మికులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ప్రభుత్వం నుంచి ఆర్డర్‌ తెచ్చుకొని పేదల భూములను అమ్ముకున్నాడని విమర్శించారు. 1993లో ఇండ్ల స్థలాల పేరుతో తెచ్చుకున్న అనుమతి పత్రాలు చూపుతూ.. మరో మారు పేద భూములును లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఆ భూ అక్రమార్కునికి ప్రభుత్వ రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, పోలీసులు అండగా నిల్చి పేదల భూములను అప్పన్నంగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే బాలాపుర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలాపూర్‌ ప్రాంతంలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే.. భూ అక్రమార్కులతో చేతులు కలిపి ఆ భూములను కాజేస్తున్న స్థానిక తహసీల్దార్‌పై విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలన్నారు. సివిల్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న పోలీసుల అధికారులపై ఉన్నతాధికారులు సీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలు భారతమ్మ మాట్లాడుతూ.. మా తాతల నాటి నుంచి ఈ భూములు దున్నుకుంటూ.. కూరగాయలు, వరి పండించుకుంటూ జీవనం సాగించామన్నారు. మా భూములపై కన్నేసిన రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల బలంతో భూ అక్రమార్కులు లాక్కుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. అడిగే వారు లేక.. ఇప్పటికే చాలా భూమి కాజేవారని, ప్రస్తుతమున్న 6 ఎకరాల భూమిలో కూడా రీక్షాపుల్లర్స్‌ అసోసియేషన్‌ పేరుతో తులసీదాస్‌ అనే లాయర్‌ మా భూములను లాకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా మా భూములను విడ్చిపెట్టేది లేదన్నారు. ఓట్ల కోసం వచ్చిన సబితమ్మ నన్ను గెలిపిస్తే .. మీ భూములకు పట్టాల్పిస్తానని చెప్పి.. ఇప్పుడు మా భూములు మాకు దక్కకుండా చేస్తోందన్నారు. స్థానిక తహసీల్దార్‌, పోలీసులు తులసీదాస్‌తో చేతులు కలిపి మా భూములను కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా భూముల మీదికి వస్తే ఎవరిని లెక్కచేసేది లేదని, మా నోటికాడి బుక్కను లాక్కుంటే ఊరుకోమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్‌, నాయకులు యాదయ్య, బాధితులు పోచయ్య, లక్ష్మమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.