Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాహన సామర్థ్య పరీక్షలు షురూ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 28,2022

వాహన సామర్థ్య పరీక్షలు షురూ

- గ్రేటర్‌లో స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ
- సర్టిఫికెట్‌ పొందాల్సిన బస్సుల సంఖ్య 13 వేలకు పైనే!
- ఇప్పటివరకు 3వేలకు పైగా బస్సులకు ఫిట్‌నెస్‌ పూర్తి
- జూన్‌ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్కూల్‌ బస్సుల సామర్థ్య నిర్వహణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే, బడి బస్సుల ఫిట్‌నెస్‌పై విద్యా సంస్థల యాజమాన్యాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరో పది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. గ్రేటర్‌లో పది వేలకుపైగా స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలకు దూరంగా ఉన్నాయి. దీంతో స్కూల్‌ బస్సులకు జరగాల్సిన పరీక్షలు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. మే 15తో బడి బస్సులకు ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన విషయం విదితమే. ఆ రోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. కానీ సరిగ్గా అమలు కావడం లేదు. ఫలితంగా గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో దాదాపు 13వేలకుపైగా స్కూల్‌ బస్సులుండగా.. 3200 బస్సులకు మాత్రమే ఎఫ్‌సీలు జారీ అయ్యాయి. మిగతా బస్సుల విషయంలో పదిరోజుల పాటు ఆర్టీఏ అధికారులు వేచిచూసి.. అనంతరం ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డెక్కితే బస్సు సీజ్‌ చేయనున్నట్టు చెబుతున్నారు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 12 ఆర్టీఏ కేంద్రాలున్నాయి. ఈ జిల్లాల్లో మొత్తం 13,082 స్కూల్‌ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోని ఐదు జోన్లలో 2231 బస్సులుండగా.. ఇప్పటివరకు 300 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 5వేల బస్సులకుగాను 1400 బస్సులకు ఫిట్‌నెస్‌ పత్రాలు జారీ చేయగా.. మేడ్చల్‌లో 1521 స్కూళ్ల బస్సులకు ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ లెక్కన గ్రేటర్‌లో ఇప్పటివరకు 3వేలకుపైగా బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ నెల 12వ తేదీలోగా దాదాపు 10వేల బస్సులకు వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే, సుమారు వెయ్యికిపైగా కాలం చెల్లిన బస్సులున్నాయి. వీటికి ఫిట్‌నెస్‌కు అనుమతించారు. స్క్రాప్‌ చేయాల్సిందే. కానీ కొన్ని విద్యా సంస్థలు దొంగచాటుగా ఈ బస్సులను నడుపుతున్నాయని సమాచారం. ఇలాంటి బస్సుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి.
పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం!
పాఠశాలల పున:ప్రారంభానికి మరో పది రోజులే సయమముంది. ఈ నేపథ్యంలో రోజుకు వెయ్యి చొప్పున బస్సులను పరీక్షించితే తప్ప.. ఈ పది రోజుల్లో పది వేల బస్సుల పరిశీలన పూర్తి కాదు. అయితే, జూన్‌ మొదటి వారం నుంచి రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నామని.. ఫిట్‌నెస్‌ లేని బస్సులను సీజ్‌ చేస్తామని పేర్కొంటున్నారు. బడి బస్సుల ఫిట్‌నెస్‌ ముగిసి 12 రోజులు అవుతోంది. కానీ ఆయా స్కూళ్ల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ.. పిల్లల భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతియేటా మే 15తో బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసే విషయం తెలిసిందే. అలాంటప్పుడు రవాణాశాఖ అధికారులు ముందస్తుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి.. ప్రయివేటు విద్యా సంస్థల బస్సులు ఫిట్‌నెస్‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు. తద్వారా రవాణాశాఖకు ఆదాయం పెరగడం, రోడ్డు ప్రమాదాలు నివారించడంతోపాటు పిల్లలకు భద్రత కల్పించవచ్చు. ఆ దిశగా రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఇవి నిబంధనలు..
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పాఠశాల బస్సులకు రవాణా శాఖ సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షల్లో భాగంగా.. బ్రేకులు, ఇంజన్‌ పనితీరు, డోర్లు, డ్రైవర్‌ అనుభవం తదితర అంశాలను పరిశీలిస్తారు. డ్రైవర్‌కు కనీసం అయిదేండ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్‌ లైసెన్స్‌తోపాటు క్లీనర్‌ ఫొటోలు, ఫోన్‌ నంబర్లు వాహనంలో ఉన్నాయా లేదా అనేది చూస్తారు. ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే లెక్కని, వారి తల్లితండ్రుల ఫోన్‌ నంబర్లు సహా బస్సులో అతికించాలి. బస్సు రూట్‌మ్యాప్‌ని ఆర్టీఏ కార్యాలయంలో అందజేయాలి. 15 ఏండ్లు దాటిన వాహనాలను అనుమతించరు. విద్యాసంస్థల బస్సులకు పసుపురంగు వేసి నాలుగు వైపులా ఆర్టీఏ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ రాయాలి. కొత్త టైర్లతోపాటు స్టెప్నీ ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తప్పనిసరి. వర్షం పడితే నీళ్లు లోపలికి రాకుండా బస్సు టాప్‌పై సీలింగ్‌ ఉండాలి. ప్రతి మూడు నెలలకోసారి డ్రైవర్‌ వైద్య పరీక్షలు చేసుకోవాలి. ఈ ఖర్చు యాజమాన్యమే భరించాలి. డ్రైవర్‌, అటెండర్‌ తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలి. ఇలా మొత్తం 30-40 నియమ నిబంధనలను పాటించిన బస్సులకు మాత్రమే ఎఫ్‌సీ మంజూరు చేస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.