Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చివరికి ప్రభుత్వాస్పత్రికి... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 28,2022

చివరికి ప్రభుత్వాస్పత్రికి...

- ఇప్పటికీ సంక్లిష్ట శస్త్రచికిత్సలకు ప్రయివేటుకే..
-  కార్పొరేట్‌ను ఎదుర్కొనడంలో వెనుకబడుతున్న సర్కారు దవాఖానాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
                'ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. గతంతో పోలిస్తే ఆ దవాఖానాలకు వచ్చే వారి సంఖ్య 20 శాతం పెరిగింది. అందుకు తగినట్టు సౌకర్యాలు సమకూరుస్తూ ఈ నమ్మకాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వాస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతాం....' ఇవి పదే పదే అధికారపక్ష నేతల నుంచి, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న మాటలు. కొన్ని కొలమానాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఇంకా పలు రకాల చికిత్సల విషయంలో కార్పొరేటు, ప్రయివేటుకే రోగులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా ఆస్పత్రులు వసూళ్లు చేసే భారీ దోపిడీని తట్టుకోలేక చివరి నిమిషంలో ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటిలో సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యుల వద్దకు సంక్లిష్ట కేసులే ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తున్నది. లోపల చికిత్స మాటేమో గానీ ఇప్పటికే ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులు ప్రవేశం దగ్గర నుంచి రోగికి అవసరమైన సమాచారాన్ని విడమర్చి చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. పీఆర్వో, మార్కెటింగ్‌ వంటి విభాగాలను ప్రత్యేకంగా నెలకొల్పుకున్నాయి. దీనికి తోడు అనేక కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో డాక్టర్లకు టార్గెట్లను నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఇందుకు సంబంధించిన వివాదాలు వెలుగులోకి వచ్చిన సందర్భాలున్నాయి. దీంతో పలు ప్రయివేటు ఆస్పత్రులు గ్రామాల నుంచి రోగులను సిఫారసు చేసే వారికి కమిషన్లు ముట్టజెబుతున్నారనేది సర్వత్రా వినపడుతున్న విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రాష్ట్రంలోని ఆస్పత్రుల సేవలకు సంబంధించి కార్పొరేట్‌, ప్రయివేటు ఆస్పత్రులదే సింహభాగం కావడం గమనార్హం. ప్రభుత్వ దవాఖానాల్లో పెరిగిన రోగుల సంఖ్యకు తగినట్టుగా డాక్టర్ల సంఖ్య పెంచకపోవడం, సౌకర్యాలను కల్పించకపోవడం, వచ్చే రోగులకు అందించబోయే చికిత్సకు సంబంధించి వివరించే వ్యవస్థ లేకపోవడం, గుండె తదితర ఆపరేషన్లకు సంబంధించిన రోగుల విషయంలో వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా ఉండటం తదితర కారణాలు కూడా వారిని ప్రయివేటుకు ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉండటంతో ప్రభుత్వాస్పత్రి కన్నా ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లడంపై రోగులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రయివేటు ఆస్పత్రుల్లో భారీగా వసూళ్లు చేస్తుండటంతో చికిత్స మధ్యలో తిరిగి ప్రభుత్వాస్పత్రికి వస్తున్నట్టు బోధనాస్పత్రుల వైద్యులు చెబుతున్నారు.
సౌకర్యాలపై ప్రచారమేది?
                కేసీఆర్‌ కిట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉండగా, అవి 56 శాతానికి చేరాయి. డెలివరీల్లో సి-సెక్షన్‌ లు 60 శాతముండగా, అందులో అత్యధికంగా ప్రయివేటులోనే జరుగుతుండటం గమనార్హం. వీటిని తగ్గించేందుకు సర్కారు ప్రయత్నాలు మొదలెట్టింది. ప్రయివేటు దోపిడీకి ముకుతాడు వేసి సర్కారు దవాఖానాలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచడమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. అదే స్థాయిలో మిగిలిన శస్త్రచికిత్సల విషయంలో జరగకపోవడం గమనార్హం. మోకాలిచిప్పల మార్పిడి శస్త్రచికిత్సలకు సంబంధించిన డాక్టర్ల సంఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో అధికంగా ఉన్నప్పటికీ ప్రయివేటులోనే ఎక్కువగా జరుగుతున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గుర్తించింది. దిద్దుబాటు చర్యగా ప్రభుత్వ డాక్టర్లను రోగుల వద్దకే పంపేలా ఆస్పత్రి బయట జనావాసాల నడుమ శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు రోగులకు ఒకే రోజులో నిర్ణయించిన సమయంలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయడం ద్వారా అక్కడి వైద్యులు తాము కార్పొరేట్‌కు తీసిపోమని నిరూపించారు. అందువల్ల మిగిలిన విభాగాల విషయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా విభాగాల ద్వారా శిబిరాల ఏర్పాటు, రోగులను గుర్తించడం, సత్వర చికిత్స అందించడం, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై ప్రచారం చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు మరింత విశ్వాసం పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.