Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రూ.50వేల పరిహారం ఏమాయే..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 29,2022

రూ.50వేల పరిహారం ఏమాయే..!

- కరోనా మృతుల కుటుంబాల ఎదురుచూపు
- దరఖాస్తులు చేసి ఏడాదైనా అంతే సంగతి
- ఎవరిని అడగాలో తెలియని అయోమయస్థితి
- కోవిడ్‌ వార్డులో మరణించినా కరోనా కాదట!
- ఈ నెపంతో సగానికి పైగా దరఖాస్తుల తిరస్కరణ
నవతెలంగాణ-ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధులు
              ''ఖమ్మం జిల్లా అర్బన్‌ మండలం గొల్లగూడెం రోడ్డులో ఉంటున్న గుర్రం కృష్ణకూమారి కోవిడ్‌తో మృతిచెందారు. గతేడాది డిసెంబర్‌ 11వ తేదీన ఆమె కుమారుడు రాజేష్‌ రూ.50వేల ఎక్స్‌గ్రేషియా కోసం మీ సేవలో అప్లై చేశారు. అప్లికేషన్‌ అప్రూవల్‌ అయినట్టు మెసేజ్‌ కూడా వచ్చింది. కానీ ఇంత వరకూ పరిహారం రాలేదు. దీనిపై ఎవర్ని ఆశ్రయించాలో అర్థం కాని పరిస్థితి ఉందని రాజేష్‌ తెలిపారు.''
              ''నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ పరిధిలో భాస్కర్‌ అనే వ్యక్తి అమ్మ, అన్నా, వదిన కరోనాతో మృతిచెందారు. ఈయన అన్నకు 18 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం వీరి బాగోగులు ఈయనే చూస్తున్నారు. కరోనా సాయం అందితే పిల్లల చదువుకు ఉపయోగపడతాయని అంటున్నారు.''
              కోవిడ్‌ మృతుల కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.50వేల అరకొర పరిహారంతో సరిపెట్టాలని నిర్ణయించింది. దానిలోనూ అనేక తిరకాసులు పెట్టింది. కరోనా మూడు వేవ్‌లలో ఎంతో మంది మరణించినా వారిలో సగం మందికి మాత్రమే కరోనాతో చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. ఇది ఒక భాగమైతే కరోనా మృతులుగా పరిగణిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వాటిలోనూ సగం అప్లికేషన్‌లను రూ.50వేల పరిహారానికి పరిగణనలోకి తీసుకోలేదని మృతుల కుటుంబీకులు వాపోతున్నారు. పరిగణనలోకి తీసుకుని నియమ నిబంధనల మేరకు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నూటికి పదిశాతం మందికి కూడా పరిహారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎక్స్‌గ్రేషియా కోసం ఎన్ని దరఖాస్తులు అందాయి? ఎంత మంది మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు? ఈ విషయాలను వెల్లడించాల్సిన తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టే ఉంటున్నారు.
ఖమ్మం అర్బన్‌ మండలం 60వ డివిజన్‌ రామన్నపేటకు చెందిన జూపల్లి వెంకులు. జిల్లా కేంద్ర ఆస్పత్రి కోవిడ్‌ వార్డులో చనిపోయారు. అయినా సరే కరోనాతో మరణించినట్టు సర్టిఫికెట్‌ ఇవ్వమని నిరాకరించడంతో ఆయన కుటుంబీకులు డీఎంహెచ్‌వో కార్యాలయం, జిల్లా కేంద్ర ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
              తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన కందుకూరి ధనమ్మ మూడురోజుల పాటు ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందింది. రెండురోజుల పాటు సాధారణ వార్డులో ఉంచి, మూడోరోజు కరోనాగా నిర్ధారించి కోవిడ్‌ వార్డులో ఉంచారు. ఒక రోజు కోవిడ్‌ వార్డులో ఉన్న అనంతరం ఆమె గతేడాది మే 18న మరణించారు. కానీ ఆమె కరోనాతో చనిపోయినట్టు అధికారులు మరణ ధ్రువీకరణపత్రం ఇవ్వకపోవడం గమనార్హం.
దరఖాస్తు అప్రూవల్‌ అయినా అంతే సంగతులు...
              ఖమ్మం జిల్లాలో మొత్తం మూడువేవ్‌లలో కరోనాతో 2,257 మందివరకూ మరణించారు. ఈ మేరకు వీరి కుటుంబీకులు ఎక్స్‌గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోగా వివిధ కారణాలతో వందలోపు దరఖాస్తులు తిరస్కరించారు. అప్రూవల్‌ అయిన దరఖాస్తులకు సంబంధించి ఎంతమందికి పరిహారం ఇచ్చారనే విషయంలో అధికారులు స్పష్టతనివ్వడం లేదు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1179 దరఖాస్తులు రాగా 1095 పరిగణలోకి తీసుకున్నారు. 52 దరఖాస్తులను తిరస్కరించారు. ఆమోదించిన దరఖాస్తుల్లోనూ సగం మందికి కూడా ఎక్స్‌గ్రేషియా అందలేదు.
              మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.5లక్షల మంది కరోనా బారిన పడగా.. 450 మంది మరణించారు. నారాయణపేట జిల్లాలో 99వేల మందికి కరోనా వచ్చింది. 311 మృతిచెందారు. గద్వాల జిల్లాలో 87 వేల మంది కరోనా బారిన పడగా, 271 మంది మరణించారు. వనపర్తి జిల్లాలో 93 వేల మందికి కరోనా రాగా, 311 చనిపోయారు. నాగర్‌కర్నూల్‌లో 1.15లక్షల మందికి కరోనా వస్తే.. 500 మందిని వైరస్‌ కబలించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం 8 నెలల కిందట ప్రకటన చేసింది. ఆర్థిక సహాయం కోసం గద్వాలలో 271, వనపర్తిలో 211 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలించి వైద్య పరీక్షల నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కలెక్టర్‌ కార్యాలయానికి పంపారు. కానీ నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదు.
దరఖాస్తుల్లో తిరకాసులు...
              కోవిడ్‌ డెత్‌ ఎక్స్‌గ్రేషియా కోసం సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి మీసేవ కేంద్రాల్లో కుటుంబీకులు అప్లై చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సభ్యులుగా ఉండే 'కరోనా మరణ నిర్ధారణ కమిటీ కోవిడ్‌-19' ధ్రువీకరించి సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. తదనంతరం ఎక్స్‌గ్రేషియాను కుటుంబీకుల అకౌంట్లలో జమ చేస్తారు. కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టుతో పాటు మున్సిపాలిటీ/ పంచాయతీ జారీ చేసిన మరణ ధ్రువీకరణపత్రం ఇచ్చినా అధికారులు ఒప్పుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్‌ రిపోర్టు లేకపోతే వైరస్‌ కారణంగా అడ్మిట్‌ అయిన ఆస్పత్రి నుంచి మరణాన్ని ధ్రువీకరించే మెడికల్‌ సర్టిఫికెట్‌ జత చేయాలి, లేదంటే కరోనా చికిత్సకు సంబంధించిన పరీక్షల బిల్లులు జత చేసినా సరిపోతుంది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదని మృతుల కుటుంబీకులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా ఉన్న ఈ కమిటీ ఎక్స్‌గ్రేషియా విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతుండటం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. ఈ విషయమై డీఎంహెచ్‌వోలు కూడా సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
దరఖాస్తులు కలెక్టర్‌కు పంపుతున్నాం
సుధాకర్‌ లాల్‌, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్‌
              బాధిత కుటుంబాల నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వీటన్నిటిని ఎప్పటికప్పుడూ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తున్నాం. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుంది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే చేసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.