Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాజెక్టు పనులకు బ్రేక్‌! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 30,2022

ప్రాజెక్టు పనులకు బ్రేక్‌!

- కోర్టు స్టేతో నిలిచిన పనులు
- ఈసారీ సాగునీరు కష్టమే..
- యథేచ్చగా నల్లమట్టి తరలింపు
- డంపు చేసుకుంటున్న కాంట్రాక్టర్లు
- మట్టి తరలింపును ఆపాలని రైతుల డిమాండ్‌
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
              పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్‌ పనులకు బ్రేకు పడింది. నార్లాపూర్‌ మొదలుకుని ఉదండాపూర్‌ వరకు పనులన్నీ నిలిచిపోయాయి. ఒకవైపు కరోనా, మరోవైపు చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపేస్తే, తమకు పరిహారం ఇచ్చే దాకా పనులు ఆపాలని నిర్వాసిత రైతులు కోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు చెరువులో మట్టి తీయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఓ పర్యావరణ ప్రేమికుడు గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాడు. ఫలితంగా పనులు నిలిపేయాలని కోర్టు స్టే విధించింది. అయితే, పనులు నిలిచిపోయినా కాంట్రాక్టర్లు నల్లమట్టిని డంపు చేసుకుని విక్రయాలు చేపట్టి కోట్లు గడిస్తున్నారు. వీరి తంతును గమనిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు నల్లమట్టి తరలింపు పనులు ఆపాలని కోరుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి కూడా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు.
              కర్వేన రిజర్వాయర్‌కు చెరువులో మట్టి వేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది.. నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడే నల్లమట్టిని కట్టకు ఉపయోగిస్తే.. రైతుల పొలాలకు సారవంతమైన మట్టి కొరత ఏర్పడుతుందని జడ్చర్లకు చెందిన పర్యావరణ ప్రేమికుడు కోస్గీ రాములు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు.
              వట్టెం, ఉదండాపూర్‌, కుడికిల్ల రిజర్వాయర్ల పరిధిలో భూములు కోల్పోయిన రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేసేదాకా పనులు నిలిపేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం స్టే విధించడంతో రిజర్వాయర్ల పనులు నిలిచిపోయాయి.
మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్లగొండ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరందించాలనే ఉద్దేశంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌ గ్రామ శివారులో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2018లో ప్రారంభించారు. రూ.62 కోట్లతో 120 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. దీని పరిధిలో 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అందులో నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కర్వేన, ఉదండాపూర్‌, లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. 90 రోజుల వరద జలాలుగా కేటాయించి మళ్లీ 45రోజులకు తగ్గించారు. ప్రస్తుతం ఏదుల, నార్లాపూర్‌ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా కుందూరు మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామ శివారులో నిరించనున్న రిజర్వాయరు పనులు మొదలు పెట్టలేదు. వట్టెం, కర్వేనా, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వట్టెం రిజర్వాయర్‌కు రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉదండాపూర్‌కు కూడా రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులు 14వ ప్యాకేజీని రూ.1700 కోట్లతో ప్రారంభించారు. 15వ ప్యాకేజీ పనులను రూ.15 కోట్లతో చేపట్టారు. పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు రాయల్టీ కింద సుమారు రూ.130 కోట్లు చెల్లించారు. కర్వేన రిజర్వాయర్‌లోని 14, 15 ప్యాకేజీలకు రూ.3,200 కోట్లు కేటాయించారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో పనులు పూర్తిగా నిలిపేశారు.
అడుగడుగునా అడ్డంకులే
              పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు అడుగడునా అడ్డంకులు ఎదురౌతున్నాయి. 2019 కరోనా సమయంలో ఆగిన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ప్రధానంగా బిల్లుల సమస్య తీవ్రంగా ఉంది. దాంతోపాటు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేయడంతో పనులు ఆగిపోయాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లు తెలిపిన వివరాల మేరకు వివిధ ఫేజ్‌లలో సుమారు రూ.1600 కోట్లు బకాయిలున్నట్టు సమాచారం. నిధులు విడుదల చేస్తే పనుల్లో పురోగతి ఉండే అవకాశాలు న్నాయి.
యథేచ్చగా నల్లమట్టి తరలింపు
              రిజర్వార్‌ పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు చెరువులు, శిఖం భూములు, ఇతర భూముల నుంచి నల్లమట్టిని తరలించి డంపు చేసుకుంటున్నారు. విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి తరలింపును ఆపాలని ఆయా గ్రామాల రైతులు అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. అధికారులు స్పందించి మట్టి దందాను నివారించాలని కోరుతున్నారు.
పనులు పూర్తి చేసి నీరివ్వాలి
ఎ.రాములు- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- మహబూబ్‌నగర్‌
              ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌కు సాగు నీరు ఆశించిన స్థాయిలో సరఫరా లేదు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తే సాగు, తాగు నీటి సమస్య తీరుతుంది. ఆరేండ్ల కిందట చేపట్టిన కర్వేన పనులు నేటికీ పూర్తి కాలేదు. పాలకులు నిర్లక్ష్యం వీడి త్వరలో బిల్లులు మంజూరు చేసి నిర్వాసితులకు న్యాయం చేసి పనులు పూర్తి చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.